News August 15, 2024
మూత్రం ఆపుకుంటున్నారా? చాలా ప్రమాదం!

ప్రయాణంలోనో, పనిలో ఉండటం వల్లో చాలామంది మూత్ర విసర్జన ఆపుకొంటుంటారు. ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ‘సాధారణంగానే మూత్రంలో క్రిములుంటాయి. ఆపుకోవడం వల్ల అవి మరింత పెరిగి మూత్రనాళ ఇన్ఫెక్షన్కు దారి తీయొచ్చు. మూత్రాశయ సంచి సాగిపోవడం, పెల్విక్ కండరాలు బలహీనపడి మూత్రంపై నియంత్రణ కోల్పోవడం వంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి యూరిన్ను ఎప్పుడూ ఆపుకోకూడదు’ అని సూచిస్తున్నారు.
Similar News
News July 8, 2025
అవి సేఫ్.. వెయ్యికి పైగా విమానాలున్నాయి: ఎయిరిండియా

అహ్మదాబాద్లో కుప్పకూలిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ మోడల్ విమానం సురక్షితమైందేనని ఎయిరిండియా తెలిపింది. పార్లమెంటరీ ప్యానెల్ ముందు ఆ సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ వెయ్యికి పైగా సేవలందిస్తున్నాయన్నారు. అధికారిక దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ మీటింగ్లో ఎయిరిండియా CEO విల్సన్, DGCA, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News July 8, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూ.గో., ప.గో., కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో వర్షం పడగా, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపించింది. నేడు మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉండిందో కామెంట్ చేయండి.
News July 8, 2025
‘కన్నప్ప’ తీయడం పూర్వజన్మ సుకృతం: మోహన్బాబు

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ‘కన్నప్ప’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర నిర్మాత మోహన్బాబు అన్నారు. ఇవాళ అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, గురువులతో కలిసి విజయవాడలో మూవీని ఆయన వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ మూవీ తీయడం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. మన సంస్కృతి, చరిత్రను పిల్లలకు తెలియజేయాలనే ఈ చిత్రాన్ని తీసినట్లు చెప్పారు.