News October 26, 2024

ఎలక్ట్రీషియన్ల సేవలు కోసం ఊర్జవీర్ స్కీమ్

image

AP: రాష్ట్రంలోని 1.2లక్షల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లను ‘ఊర్జవీర్ ఎనర్జీ ఎఫీషియన్సీ వారియర్ స్కీం’ కింద వినియోగించుకోవాలని GOVT నిర్ణయించింది. కేంద్రంతో కలిసి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లనుంది. ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను వీరి సాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం, వీధి దీపాల నిర్వహణలో వీరి సేవలను వినియోగించుకుంటామని CM చంద్రబాబు తెలిపారు.

Similar News

News October 26, 2024

ట్రంప్, వాన్స్ ఫోన్లను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు

image

రిపబ్లికన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జేడీ వాన్స్ ఫోన్లలో డేటాను చైనీస్ హ్యాకర్లు టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైనా కమ్యూనికేషన్ డేటాను వీరు యాక్సెస్ చేశారేమో తెలుసుకొనేందుకు అధికారులు దర్యాప్తు ఆరంభించారు. వెరిజోన్ ఫోన్ సిస్టమ్స్ ద్వారా హ్యాకింగ్‌ జరిగినట్టు అంచనావేశారు. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ క్యాంపెయిన్ సభ్యుల ఫోన్లనూ టార్గెట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

News October 26, 2024

హీరోతో పెళ్లి వార్తలు.. స్పందించిన హీరోయిన్

image

జయం రవితో పెళ్లి జరగబోతోందని వచ్చిన వార్తలను హీరోయిన్ ప్రియాంక మోహన్ ఖండించారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ‘జయం రవితో బ్రదర్ సినిమాలో నటించా. మేమిద్దరం దండలు వేసుకుని దిగిన ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతో మాకు నిశ్చితార్థం జరిగిందని టాలీవుడ్‌లోని కొందరు కాల్స్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. అది సినిమాలోని స్టిల్ మాత్రమే. ఆ ఫొటోనే రిలీజ్ చేసినందుకు మేకర్స్‌ను తిట్టుకున్నా’ అని తెలిపారు.

News October 26, 2024

రోహిత్ ఫ్లాప్ షో

image

హిట్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ టెస్టుల్లో ఫ్లాప్ అవుతున్నారు. NZతో సెకండ్ టెస్టులో 0,8 రన్స్‌కే పరిమితమయ్యారు. చివరి 8 టెస్టుల్లో ఆయన కేవలం ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగారు. టీమ్ గెలుపు కోసం ముందుండి ఆడాల్సిన కెప్టెనే ఇలా సింగిల్ డిజిట్‌కు పరిమితమవడంతో నెట్టింట విమర్శలొస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనైనా అండగా నిలవాల్సిందని క్రీడాభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ప్రదర్శనపై మీ కామెంట్?