News December 11, 2025
US దారిలో మెక్సికో.. భారత్పై 50% టారిఫ్స్

ఏషియన్ కంట్రీస్ దిగుమతులపై గరిష్ఠంగా 50% టారిఫ్స్ విధించేందుకు మెక్సికో సెనేట్ అంగీకరించింది. ఈ నిర్ణయంతో ఇండియా, చైనా, సౌత్ కొరియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాల 1400+ ఉత్పత్తులపై సుంకాలు 50% వరకు ఉండనున్నాయి. టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్ పార్ట్స్, ప్లాస్టిక్స్, మెటల్స్, ఫుట్వేర్ ఇండస్ట్రీస్పై ప్రతికూల ప్రభావం పడనుంది. సెలక్టివ్ ఐటమ్స్పై 50%, అత్యధిక ఉత్పత్తులపై 35% వరకు టారిఫ్స్ ఉండనున్నాయి.
Similar News
News April 5, 2026
HYDలో IPL మ్యాచ్.. నేడు డబుల్ ధమాకా

IPLలో నేడు 2 మ్యాచులు జరగనున్నాయి. 3.30PMకి హైదరాబాద్ వేదికగా SRH, LSG తలపడనున్నాయి. 7.30PMకి బెంగళూరులో CSK, RCB మ్యాచ్ జరగనుంది. HYD పిచ్ బ్యాటింగ్కు సహకరిస్తుందని, భారీ స్కోర్ నమోదయ్యే అవకాశముందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అటు బెంగళూరు పిచ్ పేసర్లకు హెల్ప్ అవుతుందని, 200 రన్స్ చేస్తే మంచి స్కోర్ అవుతుందని అంచనా. ఈరోజు LSG, CSK బోణీ కొడతాయా లేదా SRH, RCB మరో విక్టరీ సాధిస్తాయో చూడాలి.
News April 5, 2026
భారత ఎగుమతులపైనా యుద్ధ ప్రభావం: సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటికే దిగుమతులపై ప్రభావం పడింది. వెస్ట్ ఏషియా కూడా ముఖ్యమైన మార్కెట్. ఎగుమతుల్లో 12-13% అక్కడికే వెళ్తున్నాయి. వీటిపై యుద్ధ ప్రభావం ఎంతనేది 2-3 వారాల్లో స్పష్టత వస్తుంది. అన్ని రంగాల్లో ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
News April 5, 2026
టెస్టులపై BCCI ఫోకస్.. తర్వాతి తరాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్!

NZ, SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్లు ఓడటంతో BCCI రెడ్ బాల్ క్రికెట్పై ఫోకస్ పెట్టింది. జూన్/జులైలో 64 మంది U25 క్రికెటర్లతో రెడ్ బాల్ ఇంట్రా టోర్నీ నిర్వహించనుంది. వారిని 4 జట్లుగా విభజించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో మ్యాచులు ఆడించనున్నట్లు BCCI అధికారి ఒకరు తెలిపారు. ఇందులోనుంచి 25 మందిని సెలక్ట్ చేసి టెస్టుల కోసం సిద్ధం చేస్తారు. ఈ లిస్టులో వైభవ్, మాత్రే కూడా ఉంటారని సమాచారం.


