News July 1, 2024
భారతీయ కంపెనీలకు US రాయబారి వార్నింగ్

రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ హెచ్చరించారు. ‘US, సహా మిత్రదేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకం. భారత్ ఇది దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నా. US, దాని మిత్రదేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు పరిణామాలు ఎదుర్కొంటాయి’ అని అన్నారు.
Similar News
News February 6, 2026
వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

ఇంగ్లండ్తో జరుగుతున్న U19 ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడుతున్నారు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశారు. అతడి ఇన్నింగ్స్లో 10 సిక్సులు, 9 ఫోర్లున్నాయి. ప్రస్తుతం 119 పరుగులతో ఆడుతున్నారు. 21 ఓవర్లలో టీమ్ స్కోరు 186-2. కెప్టెన్ ఆయుష్ మాత్రే 53 పరుగులు చేసి ఔట్ అయ్యారు. U19 WCలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. ఫైనల్లో సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్ వైభవ్.
News February 6, 2026
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

NIT ఆంధ్రప్రదేశ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎంకామ్, PhD అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పీహెచ్డీ అర్హత గలవారికి నెలకు రూ.70వేలు, ఎంబీఏ అర్హతగల వారికి రూ.55,000 చెల్లిస్తారు. బోధన, ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nitandhra.ac.in
News February 6, 2026
శరీరంలో షుగర్ పెంచే ఆహారాలివే..

స్వీట్లు, షుగర్ ఎక్కువగా తినడం వల్లే మధుమేహం వస్తుందనేది అపోహే అంటున్నారు నిపుణులు. కొన్ని రోజువారీ ఆహారపు అలవాట్లు కూడా మధుమేహంతో ముడిపడి ఉంటాయంటున్నారు. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, గ్రేనోలా, సిరల్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, సోడా, కూల్ డ్రింకులు, అన్నం, మైదాతో చేసిన పదార్థాల వల్ల షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందంటున్నారు. వీటిని తక్కువగా తీసుకుంటూ ఆరోగ్యకర జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు.


