News April 6, 2025

రష్యా పేరెత్తడానికే US భయపడుతోంది: జెలెన్‌స్కీ

image

రష్యా తాజాగా చేసిన దాడుల్లో ఎనిమిది మంది పిల్లలు సహా 14 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ఈ విషయాన్ని US ఎంబసీకి తెలియజేస్తే బలహీనమైన ప్రతిస్పందన వచ్చిందన్నారు. ‘అగ్రరాజ్యమైనప్పటికీ ఆశ్చర్యకరంగా వీక్ రియాక్షన్ వచ్చింది. వాళ్లు రష్యన్ పేరు చెప్పడానికీ భయపడుతున్నారు’ అని ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక ఉక్రెయిన్‌కు సాయం నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News February 7, 2026

మన పొరుగు వారి కంటే మేలు: పీయూష్ గోయల్

image

అమెరికాతో చేసుకున్న <<19072293>>వాణిజ్య ఒప్పందం<<>> వల్ల రైతులకు, చేతివృత్తుల వారికి ఎలాంటి హాని కలగదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘మనపై విధించిన 18% టారిఫ్స్ పొరుగు వారి కంటే తక్కువే. చైనా 35%, వియత్నాం 20%, బంగ్లాదేశ్ 20%, ఇండోనేషియా 19% సుంకాలు ఎదుర్కొంటున్నాయి. తాజా ఒప్పందంతో ఎన్నో వస్తువులను ఎలాంటి టారిఫ్ కట్టకుండానే అమెరికాకు ఎగుమతి చేయొచ్చు’ అని తెలిపారు.

News February 7, 2026

పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

image

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.

News February 7, 2026

అన్ని US పారిశ్రామిక వస్తువులపై భారత్ జీరో డ్యూటీ: పీయూష్ గోయల్

image

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై ఏడాదిపాటు చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత జెమ్స్ అండ్ జువెలరీపై జీరో టారిఫ్స్ వర్తిస్తాయని తెలిపారు. ఏడాదికి $500 బిలియన్ల వాణిజ్యం టార్గెట్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సుంకాలను మరింత తగ్గించే విషయంపై చర్చిస్తున్నామన్నారు. USకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్ సున్నా సుంకాలు విధిస్తుందని వెల్లడించారు.