News March 19, 2024

‘అదానీ గ్రూప్‌పై US దర్యాప్తు’.. కొట్టిపారేసిన సంస్థ

image

అదానీ గ్రూప్‌‌పై US అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంది. కాగా భారత్‌లో ఓ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ అధికారులకు ముడుపులు చెల్లించి అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై US దర్యాప్తు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రభావంతో అదానీ షేర్లు, బాండ్లు భారీగా పడిపోయాయి.

Similar News

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.

News December 6, 2025

ఒక కాకి చనిపోతే మిగిలినవి ఎందుకు వస్తాయో తెలుసా?

image

సాధారణంగా ఒక కాకి చనిపోతే మిగిలినవి దాని చుట్టూ చేరి అరుస్తూ ఉంటాయి. కాకుల గుంపు కాకి మృతికి గల కారణాన్ని గమనించి.. ఆ ప్రాంతంలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. ప్రమాదకరమైన మనిషి లేదా ప్రదేశాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో జాగ్రత్త పడతాయి. సింపుల్‌గా చెప్పాలంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాయి. ఈ విధంగా తమ వంశాన్ని రక్షించుకుంటాయి. కాకి వస్తే ఎవరో చనిపోతారనేది మూఢనమ్మకం అని పరిశోధనలు చెబుతున్నాయి.

News December 6, 2025

త్వరలో హీరో సుశాంత్‌, హీరోయిన్ మీనాక్షి పెళ్లి? క్లారిటీ..

image

టాలీవుడ్ హీరో సుశాంత్, హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు SMలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె టీమ్ ఖండించింది. ఇందులో నిజం లేదని, వారిద్దరూ ఫ్రెండ్స్ అని పేర్కొంది. ఏదైనా సమాచారం ఉంటే అఫీషియల్‌గా తామే ప్రకటిస్తామని తెలిపింది. కాగా సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో మీనాక్షి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలోనూ వీరి పెళ్లిపై వార్తలు రాగా మీనాక్షి ఖండించారు.