News February 4, 2025
అక్రమ వలసదారులను తరలించేందుకు యూఎస్ భారీ ఖర్చు

తమ దేశంలోని అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఒక్కొక్కరిపై దాదాపు 4,675 డాలర్లు (రూ.4 లక్షలు) ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మామూలు విమానాల్లో టికెట్ ధర 853 డాలర్లు ఉండగా, ఇందుకు 5 రెట్లు వెచ్చిస్తోంది. వలసదారులందరినీ సీ-17, సీ-130ఈ మిలటరీ విమానాల్లోనే వారి దేశాలకు తరలిస్తోంది. ఈ విమానాల నిర్వహణకు గంటకు దాదాపు రూ.2 కోట్ల నుంచి రూ.7.50 కోట్లు ఖర్చు అవుతుందని సమాచారం.
Similar News
News January 6, 2026
ఆకివీడు: షైనీ ప్రతిభను మెచ్చి కేంద్ర మంత్రి అభినందనలు

అంతర్జాతీయ స్థాయిలో మల్టీ టాలెంటెడ్ అవార్డుతో పాటు ఇటీవల ‘నంది’ అవార్డు గెలుచుకున్న ఆకివీడు మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ శిష్యురాలు ఘంటా షైనీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభినందించారు. మంగళవారం ఆయనను కలిసిన షైనీని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


