News April 10, 2025

చైనా వస్తువులపై అమెరికా టారిఫ్ 145%

image

చైనాపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాలు 145 శాతానికి పెరిగాయి. బుధవారం చైనా వస్తువులపై 125% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అప్పటివరకు చైనా దిగుమతులపై అమెరికా 20% టారిఫ్ విధిస్తోంది. దీంతో ఆ రెండు కలిపి అది 145 శాతానికి పెరిగింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు 70 దేశాలపై విధించిన సుంకాలను ట్రంప్ 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 18, 2025

ఉక్రెయిన్ ఆరోపణలు నిరాధారం: చైనా

image

రష్యాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఉక్రెయిన్ చేసిన ఆరోపణలు నిరాధారమని చైనా స్పష్టం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మా వైఖరి చాలా క్లియర్‌గా ఉంది. సీజ్‌ఫైర్ రావాలనే మేం కోరుకుంటున్నాం. యుద్ధాన్ని త్వరగా ముగించి శాంతి చర్చలు ప్రారంభించాలని ఇరు దేశాలకూ చెబుతున్నాం. అలాంటిది రష్యాకు మేం ఎందుకు ఆయుధాలు సరఫరా చేస్తాం? అవి అర్థంలేని ఆరోపణలు’ అని పేర్కొంది.

News April 18, 2025

ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తా.. కేసులకు భయపడను: భూమన

image

AP: SV గోశాలలో ఆవుల మృతిపై మాట్లాడినందుకు తన మీద <<16135353>>కేసులు పెట్టడంపై<<>> టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలాంటి వంద కేసులు పెట్టినా తాను భయపడబోనని స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. వ్యక్తిత్వ హననం చేస్తే తాను వెనక్కి తగ్గుతాననుకుంటే అది వారి భ్రమ అని పేర్కొన్నారు. ఈ 10 నెలల కాలంలో టీటీడీ అప్రదిష్టపాలైందని విమర్శించారు.

News April 18, 2025

నాకు గుడి కట్టండి: ఊర్వశి

image

స్పెషల్ సాంగ్స్‌తో ఫేమస్‌ అయిన ఊర్వశీ రౌతేలా దక్షిణాదిన తనకు గుడి కట్టాలని కోరారు. బద్రీనాథ్ దగ్గర్లో ఊర్వశీ ఆలయం ఉందని.. అక్కడ అందరూ తన ఆశీర్వాదం తీసుకుంటారని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులైతే తన ఫొటోకు మాలలు వేసి భక్తిగా కొలుస్తారన్నారు. పనిలో పనిగా దక్షిణాదినా ఒక గుడి కడితే బాగుంటుందని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు చూశాక ఊర్వశిని త్వరగా డాక్టర్లకు చూపించాలని నెటిజన్స్ ఫైరవుతున్నారు.

error: Content is protected !!