News October 25, 2024
BSNLకే యూజర్ల ఓటు

ప్రైవేటు టెలికం కంపెనీల ఛార్జీల పెంపుతో BSNLవైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. జులైలో 29.3లక్షల మంది BSNLలో చేరగా ఆగస్టులో 25.3 లక్షల మంది ఈ నెట్వర్క్ను ఎంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. అటు JIO 40.2లక్షలు, Airtel 24.1లక్షలు, Vi 18.7లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ఇతర నెట్వర్క్లతో పోలిస్తే BSNL టారిఫ్ పెంచబోమని పేర్కొనడంతో యూజర్లు ఆవైపుగా మొగ్గు చూపుతున్నారని సమాచారం.
Similar News
News November 27, 2025
NIT వరంగల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<
News November 27, 2025
పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.
News November 27, 2025
పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>


