News October 25, 2024
BSNLకే యూజర్ల ఓటు

ప్రైవేటు టెలికం కంపెనీల ఛార్జీల పెంపుతో BSNLవైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. జులైలో 29.3లక్షల మంది BSNLలో చేరగా ఆగస్టులో 25.3 లక్షల మంది ఈ నెట్వర్క్ను ఎంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. అటు JIO 40.2లక్షలు, Airtel 24.1లక్షలు, Vi 18.7లక్షల మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయినట్లు వెల్లడించింది. ఇతర నెట్వర్క్లతో పోలిస్తే BSNL టారిఫ్ పెంచబోమని పేర్కొనడంతో యూజర్లు ఆవైపుగా మొగ్గు చూపుతున్నారని సమాచారం.
Similar News
News October 22, 2025
వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.
News October 22, 2025
నకిలీ మద్యం కేసు: 7 రోజుల పోలీస్ కస్టడీ!

AP: నకిలీ మద్యం కేసు నిందితులను 7 రోజుల పోలీస్ కస్టడీకి VJA కోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ జైలులో ఉన్న A2 జగన్ మోహన్రావును రేపు, నెల్లూరు జైలులో ఉన్న A1 జనార్దన్రావును ఎల్లుండి కస్టడీలోకి తీసుకోనున్నారు. A13 తిరుమలశెట్టి శ్రీనివాస్నూ కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రేపటికి వాయిదా పడింది. అటు జనార్దన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ కూడా కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.
News October 22, 2025
బిగ్ ట్విస్ట్.. హోల్డ్లో నవీన్ యాదవ్ నామినేషన్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్పై ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన నామినేషన్కు రిటర్నింగ్ అధికారి ఇంకా ఆమోదం తెలపలేదు. ఫామ్-26 తొలి 3 పేజీల కాలమ్స్ విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాటిని ఆర్వో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే మళ్లీ పిలుస్తామని, వెయిట్ చేయాలని నవీన్కు సూచించారు. దీంతో INC శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.