News September 12, 2024

చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లిన ఉత్తమ్ దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

Similar News

News January 5, 2026

వరి నాట్లు.. ఇలా చేస్తే అధిక ప్రయోజనం

image

వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. వరి నారు కొనలను తుంచి నాటితే కాండం తొలుచు పురుగు, ఇతర పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటితే పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.

News January 5, 2026

బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎలక్షన్స్

image

TG: మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతకుముందు 2014లో EVMలు, 2020లో కరోనా కారణంగా బ్యాలెట్‌తో నిర్వహించారు. ఈసారి EVMలతో నిర్వహించే అవకాశమున్నా బ్యాలెట్ వైపే మొగ్గుచూపారు. మరో వారం, 10 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా రానుంది.

News January 5, 2026

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్!

image

TG: గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్ వల్ల ఆగిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం ప్రకటించగానే పలువురు నిర్మాణాలు మొదలుపెట్టారు. తుది జాబితాలో చోటు దక్కక కొందరు వదిలేశారు. అలా ఆగిపోయిన ‘గృహలక్ష్మి’ ఇళ్లు 13 వేల వరకు ఉండగా వాటికి నిధులు విడుదలయ్యే ఛాన్సుంది.