News December 18, 2024

పశుసంవర్ధకశాఖలో త్వరలో పోస్టుల భర్తీ

image

AP: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. అటు శ్రీకాకుళం, ప.గో. జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News November 16, 2025

నా వర్క్‌కు పర్సనల్ నంబర్ వాడను: అదితీరావు

image

హీరోయిన్ అదితీరావు హైదరీ ఫొటోలను ఉపయోగిస్తూ పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె ఇన్‌స్టాలో ఓ నోట్ రిలీజ్ చేశారు. ‘ఫొటో‌షూట్‌ల పేరుతో ఫొటోగ్రాఫర్లకు దుండగులు వాట్సాప్‌లో నా ఫొటో పెట్టుకొని సంప్రదిస్తున్నారు. నేనెప్పుడూ నా వర్క్‌కు పర్సనల్ నంబర్‌ను వాడను. ఏదైనా నా టీమ్ చూసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

image

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్‌లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.

News November 16, 2025

ప్రభుత్వం విఫలం.. క్వింటాల్‌కు ₹2వేల నష్టం: KTR

image

TG: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘ప్రస్తుతం క్వింటాల్‌కు ₹8,110 కనీస మద్దతు ధర ఉంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో రైతులకు ₹6,000-7,000 మాత్రమే దక్కుతోంది. రైతులు క్వింటాల్‌పై ₹2,000 వరకు నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనకుండా CCI కఠినంగా వ్యవహరిస్తోంది’ అని ఫైరయ్యారు.