News December 18, 2024
పశుసంవర్ధకశాఖలో త్వరలో పోస్టుల భర్తీ

AP: రాష్ట్రంలో త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది. పశు సంవర్ధక శాఖలో 297 పోస్టులు భర్తీ చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను APPSC భర్తీ చేయనుంది. అలాగే పశుకిసాన్ క్రెడిట్ కార్డులపై 3% వడ్డీ రాయితీతో రూ.2లక్షల వరకు రుణాలను ఇవ్వాలన్నారు. అటు శ్రీకాకుళం, ప.గో. జిల్లాల్లో ఆగిపోయిన మత్స్యకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News October 16, 2025
చైనాపై 500% టారిఫ్స్ విధించాలి: బెస్సెంట్

US-చైనా ట్రేడ్ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది. చైనాపై టారిఫ్స్ను 500%కి పెంచుతామని అమెరికా బెదిరిస్తోంది. ‘రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు 85మంది US సెనేటర్లు చైనాపై టారిఫ్స్ను 500%కి పెంచేందుకు ట్రంప్కు అధికారమివ్వాలని చూస్తున్నారు’ అని US ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. పైకి రష్యన్ ఆయిల్ పేరు చెబుతున్నా.. రేర్ ఎర్త్ మెటల్స్ కోసమే ఈ బెదిరింపులని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 16, 2025
యజ్ఞం ఎలా ఆవిర్భవించిందంటే?

మనిషి చేసే ఏ కార్యమైనా ఫలించాలంటే మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు. అందుకు దైవకృప కూడా తప్పనిసరిగా ఉండాలి. మన వేదం కూడా ఇదే విషయం చెబుతోంది. అందుకే దైవకృపను పొందడానికి వేదం యజ్ఞాన్ని ఆవిర్భవించింది. యజ్ఞం అంటే ఒంటరిగా చేసేది కాదు. అందరూ కలిసి చేయాలి. అప్పుడే అద్భుతమైన ఫలితం ఉంటుంది. పురోహితులు, యజమానులు.. ఇలా సమష్టి శ్రమ, కృషి వల్లే యజ్ఞం విజయవంతం అవుతుంది. <<-se>>#VedikVibes<<>>
News October 16, 2025
భారత్పై WTOకి చైనా ఫిర్యాదు

ఇండియా అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్, EV బ్యాటరీ సబ్సిడీలపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు ఫిర్యాదు చేసింది. ఇది దేశీయ తయారీదారులకు అన్యాయమైన ప్రయోజనాన్ని కల్పిస్తోందని, చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని ఆరోపించింది. తమ దేశీయ పరిశ్రమల ప్రయోజనాలు, హక్కుల కోసం కఠిన చర్యలు తీసుకుంటామని వారి వాణిజ్య శాఖ హెచ్చరించింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే IND అధిక సబ్సిడీలు అందిస్తోందని అసహనం వ్యక్తం చేసింది.