News August 18, 2024
RSS ద్వారా పోస్టుల భర్తీ: రాహుల్ ఫైర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720446335852-normal-WIFI.webp)
ప్రభుత్వ శాఖల్లోని ఉన్నత స్థానాలను UPSC ద్వారా కాకుండా RSS ద్వారా భర్తీ చేస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ముఖ్యమైన పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. తద్వారా బ్యూరోక్రసీలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోతోందన్నారు.
Similar News
News February 11, 2025
రూ.70 కోట్లు దాటిన ‘తండేల్’ కలెక్షన్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739256455664_782-normal-WIFI.webp)
నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన ‘తండేల్’ మూవీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. FEB 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై నాలుగు రోజుల్లో రూ.73.20 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ టీం ప్రకటించింది. ఈ మేరకు ‘బ్లాక్బస్టర్ లవ్ సునామీ’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని K.మత్స్యలేశం గ్రామానికి చెందిన రామారావు, జాలర్ల వాస్తవిక కథ ఆధారంగా తెరకెక్కించిన ‘తండేల్’కు పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
News February 11, 2025
DANGER: ఈ ఫుడ్ కలర్ వాడితే క్యాన్సర్ రావొచ్చు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252149089_746-normal-WIFI.webp)
అమెరికాలో బ్యాన్ చేసిన ‘RED DYE #3’ ఫుడ్ కలర్ను చీప్గా వస్తోందని ఇండియాలోని చాలా కంపెనీలు వాడుతున్నాయి. ఈ రంగును చాక్లెట్స్, డ్రింక్స్, కేకుల్లో వాడుతుంటారు. ఇది హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘RED DYE #3’ ఎలుకపై టెస్ట్ చేయగా అది క్యాన్సర్కు దారితీసింది. పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, ఎలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రొడక్ట్ లేబుల్ చెక్ చేసి దానిలో ‘RED3’ అని ఉంటే వాటిని కొనకండి.
News February 11, 2025
మద్యం నుంచి TDP పెద్దలకు కమీషన్లు: YCP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736653153325_367-normal-WIFI.webp)
AP: రాష్ట్రంలో మద్యం ధరలు పెరగడంపై YCP ఆరోపణలు చేసింది. ‘మద్యం వ్యాపారం ప్రభుత్వ పెద్దల వ్యక్తిగత ఆదాయ వనరుగా మారింది. ఈ మేరకు లైసెన్సీలకు మార్జిన్ పెంచుతున్నారు. దీంతో TDP పెద్దలకు కూడా కమీషన్ పెరుగుతోంది. అంతిమంగా మద్యం రేట్లు పెరుగుతున్నాయి. ఇది మందుబాబులకు పెనుభారంగా మారనుంది’ అని ట్వీట్ చేసింది. రూ.99 బ్రాండ్ క్వార్టర్, బీర్లు కాకుండా మిగతా మద్యం సీసాపై రూ.10 పెంచిన విషయం తెలిసిందే.