News December 26, 2024
వైకుంఠద్వార దర్శనం.. 9 చోట్ల టికెట్ల జారీ!

మార్చి-2025 నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా క్షణాల్లో బుక్ అయిపోయాయి. వీటితో పాటు వైకుంఠద్వార దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల విడుదలపై ప్రకటన చేసింది. 2025 జనవరి 10-12 వరకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు అందజేస్తామని తెలిపింది. వీటిని జనవరి 8న ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 9 ప్రదేశాల్లో అందజేస్తారు. కాగా, ఈ పది రోజుల్లో టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతించరు.
Similar News
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.
News November 22, 2025
తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2
News November 22, 2025
iBOMMA రవిని పోలీస్ శాఖలో నియమించుకోవాలి:CVL

iBOMMA రవిని అందరూ రాబిన్హుడ్లా చూస్తున్నారని సీనియర్ అడ్వొకేట్, నటుడు CVL నరసింహారావు చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడితే సినిమాల్లో ఒకరు పుట్టుకొస్తాడని, అదే తీరులో రవి వచ్చాడని తెలిపారు. నిర్మాతలు తప్ప అతనిపై సామాన్యులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఎంతో నాలెడ్జ్ ఉన్న రవిని శిక్షించడం కంటే పోలీస్ శాఖలో సైబర్ నేరాల నియంత్రణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.


