News June 27, 2024
చేతిరాత బిల్లులకు చెల్లు.. ఇక ఆన్లైన్ పర్మిట్లే

AP: గనుల శాఖలో, ఇసుక అమ్మకాల్లో ఆన్లైన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లు చేతిరాతతో ఇచ్చిన బిల్లులతో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం అంటోంది. దీంతో గత టీడీపీ హయాంలో ఉన్న ఆన్లైన్ విధానాన్నే తీసుకురానున్నారు. ఈ మేరకు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలతో అధికారులు చర్యలు చేపట్టారు. ఇటు సీవరేజి వసూళ్ల కాంట్రాక్టర్లూ ఆన్లైన్ పర్మిట్లే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News January 1, 2026
సంతానోత్పత్తి తగ్గి కొరియాలో స్కూళ్ల మూత

పిల్లలు రాక ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతుండడం సాధారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇది షరా మామూలైంది. అయితే మన దగ్గర సదుపాయాలు, టీచర్ల లేమి, ప్రైవేటు స్కూళ్ల పోటీ కారణమైతే అక్కడ సంతానోత్పత్తి తగ్గడం దీనికి కారణం. దక్షిణ కొరియాలో గత కొన్నేళ్లలో 4008 GOVT స్కూళ్లు మూతపడ్డాయి. వీటిలో 3674 స్కూళ్లు ఎలిమెంటరీయే. ఈ దేశంలో సంతానోత్పత్తి రేటు 0.7కు పడిపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే ప్రపంచంలో ఇదే అత్యల్పం.
News January 1, 2026
ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్లో 928, ఫ్యూచర్ సిటీలో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.


