News March 27, 2025

వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్

image

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71గా ఉన్న ఆయన ప్రస్తుతం అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఇవ్వాలని వంశీ విజయవాడ కోర్టును ఆశ్రయించగా ఇరువైపులా వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ధర్మాసనం ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Similar News

News January 15, 2026

అమెరికా సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌కు షాక్

image

అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 21 నుంచి 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్, బ్రెజిల్, రష్యా, ఇరాన్, సోమాలియా, అఫ్గానిస్థాన్‌ సహా అనేక దేశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా USతో సన్నిహితంగా ఉంటున్న పాక్‌కు ఈ నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు.

News January 15, 2026

TODAY HEADLINES

image

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్‌ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన

News January 15, 2026

WPL: ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

image

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూపీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో షెఫాలీ వర్మ (36) శుభారంభం ఇవ్వగా, లిజెల్లీ లీ (67) చెలరేగి ఆడి మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఢిల్లీ, ఈ గెలుపుతో టోర్నీలో తన ఖాతాను తెరిచింది.