News February 25, 2025

తొలిరోజు ముగిసిన వంశీ కస్టడీ

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. రెండున్నర గంటల పాటు పోలీసులు ఆయన్ను పలు అంశాలపై విచారించారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో చేయించారు? ఎందుకు చేయించారు? సత్యవర్ధన్ స్టేట్‌మెంట్‌పైనా మరికొన్ని ప్రశ్నలను పోలీసులు సంధించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి, ఆ తర్వాత జిల్లా జైలులో విడిచిపెట్టనున్నారు.

Similar News

News February 25, 2025

అవి కేరళ చరిత్రలోనే అత్యంత క్రూరమైన హత్యలు: పోలీసులు

image

కేరళ తిరువనంతపురంలో యువకుడు అఫాన్(23) ఐదుగురు కుటుంబీకులను చంపిన <<15571171>>ఘటనలో<<>> దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బాబాయ్ లతీఫ్ తలపై 20సార్లు సుత్తితో బాదాడు. ప్రియురాలు ఫర్జానా, పిన్ని సుజాత, తల్లి, తమ్ముడిని ఇలాగే హతమార్చాడు. వారి ముఖాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. 3ఇళ్లలో భయానక దృశ్యాలు కనిపించాయి. కేరళ చరిత్రలోనే ఈ హత్యలు అత్యంత క్రూరమైనవి’ అని పోలీసులు తెలిపారు.

News February 25, 2025

నీటి వినియోగం తగ్గించాలని APకి KRMB ఆదేశం

image

హైదరాబాద్‌లో నిన్న జరిగిన సమావేశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీశైలం నుంచి నీటి వినియోగం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీరే తీసుకోవాలని ఏపీని ఆదేశించింది. సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ తీసుకునే నీరు 7వేల క్యూసెక్కులకు తగ్గించాలని స్పష్టం చేసింది. అటు రేపు మరోసారి KRMB సమావేశం జరగనుండగా, ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

News February 25, 2025

డయాబెటిస్ పేషెంట్స్ ఈ టిప్స్ ట్రై చేయండి

image

భోజనం తర్వాత షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే నిపుణులు కొన్ని టిప్స్ సూచించారు.1.గ్లాస్ వేడి నీటిలో టేబుల్‌ స్పూన్ ఆపిల్ వెనిగర్‌ను వేసుకొని తాగండి. 2 చియా గింజలను నీటిలో నానబెట్టి తాగండి. 3. దోసకాయ ముక్కల్నినిమ్మరసంతో కలిపి తినండి 4.ఆకుకూరల సలాడ్ తీసుకోండి. 5. కొన్ని వాల్‌నట్స్, బాదం తినండి . 6 గ్లాసు నీటిలో దాల్చిన చెక్క నానబెట్టి తాగండి. వీటిని ఫాలో అయ్యి మీ డయాబెటిస్‌ కంట్రోల్ ఉంచుకోండి.

error: Content is protected !!