News February 15, 2025
వంశీ అక్రమార్జన రూ.195 కోట్లు: టీడీపీ

AP: వల్లభనేని వంశీ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించారని టీడీపీ ట్వీట్ చేసింది. ‘వంశీ ఐదేళ్లలో మట్టి, గ్రావెల్, క్వారీల అక్రమ తవ్వకం, రవాణా ద్వారా రూ.195 కోట్లు సంపాదించినట్లు విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ నివేదికలో పేర్కొంది. ఇది గాక మరెన్నో అక్రమ దందాలతో, బెదిరింపులతో రూ.1000 కోట్లకు పైనే సంపాదించాడని ప్రజలు చెబుతున్నారు’ అని పేర్కొంది.
Similar News
News September 16, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రూపొందించిన చిత్రం ‘OG’. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండకపోవచ్చని సినీ వర్గాలు తెలిపాయి. సినిమా రిలీజ్ తేదీ 25న అర్ధరాత్రి ఒంటి గంటకు లేదా తెల్లవారుజామున 4 గంటలకు షోస్ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
News September 16, 2025
ACS అధికారిణి ఇంట్లో నోట్ల కట్టలు.. అరెస్టు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నూపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.కోటికి పైగా నగదు, రూ.కోటి విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివాదాస్పద భూ సంబంధిత అంశాలలో ప్రమేయం ఉందనే ఆరోపణలతో 6 నెలలుగా ఆమెపై ప్రత్యేక విజిలెన్స్ సెల్ నిఘా పెట్టినట్లు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
News September 16, 2025
పిల్లలకు డైపర్లు వేస్తున్నారా?

పిల్లలకు డైపర్లు వాడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. *2 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడొచ్చు *ఇంట్లో ఉన్నప్పుడు కాటన్వి, ప్రయాణాల్లో డిస్పోజబుల్ డైపర్లు వాడటం మేలు *డైపర్లను ఎక్కువసేపు మార్చకుండా వదిలేస్తే ఒరుసుకుపోవడం, గజ్జల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది *డైపర్ విప్పాక అవయవాలకు గాలి తగిలేలా ఉండాలి *గోరువెచ్చని నీళ్లతో కడిగేసి సున్నితంగా కాటన్ బట్టతో అద్దాక కొత్తది వేయాలి.