News February 28, 2025

బ్యారక్ మార్చాలని వంశీ పిటిషన్

image

AP: తన బ్యారక్ మార్చాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టును కోరారు. ఈమేరకు ఆయన తరఫు లాయర్లు పిటిషన్ వేశారు. బ్యారక్‌ను మార్చడం కుదరకపోతే, కొందరు ఖైదీలను తన గదిలో ఉంచాలని విన్నవించారు. తనకు 6-4 సైజ్ బ్యారక్ ఇచ్చారని, అందులో మంచం కూడా పట్టడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా తనకు ఆస్తమా ఉందని, సెల్‌లో తనకు తోడుగా మరొకరని ఉంచాలని నిన్న జడ్జిని వంశీ కోరిన సంగతి తెలిసిందే.

Similar News

News February 28, 2025

టెన్త్, ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 300 నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును మార్చి 3 వరకు పొడిగించారు. ఇందులో జనరల్ డ్యూటీ 260(మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ అర్హత), డొమిస్టిక్ బ్రాంచ్ 40(టెన్త్ అర్హత) పోస్టులున్నాయి. వయసు 18-22 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు 21,700-69,100 ఉంటుంది.
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/

News February 28, 2025

CT: ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా చెత్త రికార్డును నమోదు చేసింది. ఏకంగా 37 ఎక్స్‌ట్రాలు సమర్పించుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకిదే అత్యధికం. అంతకుముందు 2009లో విండీస్‌తో జరిగిన మ్యాచులో 36 అదనపు పరుగులు సమర్పించుకుంది. ఓవరాల్‌గా 2004లో కెన్యాతో మ్యాచులో భారత జట్టు 42 ఎక్స్‌ట్రా పరుగులు ఇచ్చింది.

News February 28, 2025

వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

image

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.

error: Content is protected !!