News November 12, 2024

వందేభారత్ ఫుడ్.. పనీర్ కర్రీ చూడండి!

image

వందేభారత్ రైళ్లలో ఫుడ్ దారుణంగా ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. రూ.220 తీసుకుని నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పనీర్ కర్రీ నీళ్లలాగా ఉందని, దీన్ని ఎలా తినాలని ప్రశ్నించారు. మెనూ ఛాయిస్ కూడా ఉండట్లేదని వాపోయారు. రైళ్లలో కంటే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్లడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News November 13, 2025

‘ఓం’ అని పలికితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

image

ఓంకార నాదంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ పవిత్ర శబ్దం, విశ్వ నాదం(432 Hz)తో ఏకమై కొత్త శక్తిని సృష్టిస్తుంది. దీనివల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై, అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే నిత్యం ఓంకార పఠనం చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.
☛ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 13, 2025

124 పోస్టులకు SAIL నోటిఫికేషన్

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>) 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in

News November 13, 2025

డెయిరీ ఫామ్ నిర్వహణకు పాడి పశువులను ఎప్పుడు కొనాలి?

image

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న లాంటి పశుగ్రాసాలను.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ లాంటి చిక్కుడు జాతి పశుగ్రాసాలను సాగుచేయాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలని సలహా ఇస్తున్నారు.