News September 15, 2024

జోన్‌లోనే అతిపెద్ద వందేభారత్ రైలు

image

సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ <<14097101>>రైలును <<>>ప్రధాని మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. 20 కోచ్‌లతో నడిచే ఈ రైలు జోన్‌లో ప్రయాణించే వాటిలో అతిపెద్దదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్-బెంగళూరు వందేభారత్ 8 కోచ్‌లతో నడుస్తుండగా, విశాఖ, తిరుపతి వెళ్లేవి 16 కోచ్‌లతో నడుస్తున్నాయి. రేపు ప్రారంభమయ్యే వందేభారత్ 20 కోచ్‌లతో నడవనుంది. 2 ఎగ్జిక్యూటివ్, 18 ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

Similar News

News November 23, 2025

డిసెంబర్ 6న వైజాగ్‌కు రోహిత్, కోహ్లీ

image

IND, SA మధ్య ఈనెల 30 నుంచి 3 మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. చివరి వన్డేను విశాఖలోని ACA-VDCA స్టేడియంలో ఆడనున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం AP క్రికెట్ ఫ్యాన్స్‌కు దక్కనుంది. ఈ మ్యాచు టికెట్లు NOV 28 నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్‌లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య ఉంటుంది.

News November 23, 2025

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా?

image

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ‘సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు స్త్రీల ఉదర భాగం నేలకు తాకుతుంది. ఆ ప్రదేశంలో గర్భకోశం ఉంటుంది. కాబట్టి గర్భకోశానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే స్త్రీలు అలా చేయకూడదు. బదులుగా మోకాళ్లపై కూర్చొని, తలను వంచి సాదర నమస్కారం చేయవచ్చు. అలాగే నడుము వంచి కూడా ప్రార్థించవచ్చు. సాష్టాంగ నమస్కారం పురుషులకు మాత్రమే’ అని చెబుతున్నారు.

News November 23, 2025

రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి?

image

భారత్‌లో రూ.10కి లభించే బెస్ట్ థింగ్ ఏంటి? అనే సోషల్ మీడియా పోస్టుకు నెటిజన్లు ఆసక్తికర సమాధానాలిస్తున్నారు. టీ, బాయిల్డ్ ఎగ్, చిన్న సమోసా, సిగరెట్, లోకల్ ట్రైన్ టికెట్, చిప్స్, వాటర్ బాటిల్, బిస్కెట్స్, చాక్లెట్స్, పెన్, పెన్సిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీ దృష్టిలో రూ.10కి కొనగలిగే బెస్ట్ ఐటమ్ ఏంటో కామెంట్ చేయండి.