News July 2, 2024

వరలక్ష్మీ శరత్ కుమార్ సంగీత్ పార్టీ వేడుక (PHOTOS)

image

నటి వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలయ్ సచ్‌దేవ్‌ల వివాహం బంధుమిత్రుల సమక్షంలో మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈక్రమంలో సంగీత్ పార్టీకి సెలబ్రెటీలతో కలిసి వరలక్ష్మి, రాధికా శరత్ సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ వేడుకలో త్రిష, మంచు లక్ష్మి, మమతా మోహన్ దాస్, అర్చనా కల్పతితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. పెళ్లి కూతురుతో దిగిన ఫొటోలను త్రిష ఇన్‌స్టాలో పంచుకున్నారు.

Similar News

News September 19, 2024

మళ్లీ తుఫాను ముప్పు.. అతిభారీ వర్షాలకు ఛాన్స్

image

AP: ఉత్తర, మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. ఇది తీవ్రరూపం దాల్చి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉ.గో, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పశ్చిమ వాయవ్య దిశగా వీస్తున్న గాలుల ప్రభావంతో రేపటి నుంచి వానలు పడే అవకాశం ఉందన్నారు.

News September 19, 2024

సంచలనాల అఫ్గాన్: INDపై మినహా అన్ని టెస్టు జట్లపై విజయం

image

కొన్నేళ్లుగా అగ్రశ్రేణి జట్లను మట్టికరిపిస్తూ అఫ్గాన్ సంచలనాలు సృష్టిస్తోంది. నిన్న SAపై తొలిసారి వన్డే మ్యాచ్‌లో గెలిచింది. దీంతో భారత్‌పై మినహా టెస్టు క్రికెట్ ఆడే అన్ని జట్లపై విజయాన్ని(టెస్ట్/ODI/T20) సొంతం చేసుకుంది. AUS, NZ, PAK, WI, SL, ZIM, ఐర్లాండ్, BANలపై T20లలో, BAN, ENG, ఐర్లాండ్, PAK, SA, SL, WI, ZIMపై ODIల్లో, బంగ్లా, ఐర్లాండ్, జింబాబ్వేపై టెస్టుల్లో గెలిచింది.

News September 19, 2024

పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్.. మేఘాకు కాంట్రాక్ట్

image

AP: పోలవరం ప్రాజెక్టులో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని నిన్న క్యాబినెట్ నిర్ణయించింది. మొత్తం 63,656 చ.మీ. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ పనులను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించింది. కొత్తగా టెండర్లు పిలిస్తే ఏడాది సమయం పడుతుందని.. మేఘాకు ఇవ్వడం వల్ల ఈ నవంబర్ నుంచే పనులు ప్రారంభించవచ్చని మంత్రిమండలి అభిప్రాయపడింది.