News August 8, 2025
వరలక్ష్మీ వ్రతం.. భారీగా పెరిగిన పూల ధరలు!

AP: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లో పూల ధరలు భారీగా పెరిగాయి. విజయవాడ హోల్ సేల్ మార్కెట్లో బంతిపూలు కేజీ రూ.300, గులాబీ, చామంతి కేజీ రూ.600 పలికింది. జాజులు, కనకాంబరాలు, మల్లెలు రూ.1200లకు కొనుగోలు చేశారు. కలువ పువ్వు ఒక్కోటి రూ.50 వరకు విక్రయించారు. రిటైల్ మార్కెట్లో ధరలు ఇంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
Similar News
News August 8, 2025
IPL: RRతో సంజూ కటీఫ్!

రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూన్లోనే సంజూ ఈ విషయాన్ని <<17327950>>యాజమాన్యానికి<<>> చెప్పారని, కానీ వారు ఒప్పుకోలేదని ESPNcricinfo తెలిపింది. దీంతో ఈ వ్యవహారాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన ఒప్పుకుంటే సంజూను రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత సంజూను మరో ఫ్రాంచైజీ ఆటగాడితో ట్రేడ్ చేసుకుంటారు. అది సాధ్యం కాకపోతే సంజూ 2026లో వేలంలోకి వెళ్లనున్నారు.
News August 8, 2025
సుంకాల నుంచి ఫార్మాకు మినహాయింపు.. ఎందుకంటే?

అమెరికాలో వాడే జనరిక్ మెడిసిన్లలో 40% మందులు భారత్ నుంచి ఎగుమతి అవుతాయి. క్యాన్సర్, ఇతర ప్రమాదక వ్యాధులకు మన దేశ మందులనే వాడుతారు. అయితే ట్రంప్ సర్కార్ టారిఫ్స్ నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఇచ్చింది. మెడిసిన్ ధరలు భారీగా పెరిగితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని భారత ఫార్మా కంపెనీలు USలోనే ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
News August 8, 2025
రేప్ కేసులో పాక్ క్రికెటర్ అరెస్టు.. బెయిల్పై విడుదల

రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.