News June 29, 2024
ప్రధాని మోదీకి వివాహ ఆహ్వానం అందించిన వరలక్ష్మి
నటి వరలక్ష్మి శరత్ కుమార్, నికోలయ్ సచ్దేవ్ల వివాహం జులై 2న థాయ్లాండ్లో జరగనుంది. ఈక్రమంలో వరలక్ష్మి పలువురు సెలబ్రిటీలను స్వయంగా కలిసి చెన్నైలో జరిగే రిసెప్షన్కి ఆహ్వానిస్తున్నారు. తాజాగా తండ్రి శరత్ కుమార్, రాధికతోపాటు కాబోయే దంపతులు ప్రధాని మోదీని కలిశారు. రిసెప్షన్ ఇన్విటేషన్ కార్డు అందించి ఆయనను ఆహ్వానించారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ తమకు టైమ్ ఇచ్చినందుకు ఆమె మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 21, 2024
డిగ్రీ కోర్సులను మార్చుకోవాలనుకుంటున్నారా?
TG: డిగ్రీ కోర్సులను మార్చుకునేందుకు విద్యాశాఖ అధికారులు అవకాశం కల్పించారు. దోస్త్ కౌన్సెలింగ్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే డిగ్రీ సీట్లు భర్తీ చేశారు. ఈనెల 21 నుంచి 23 వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకుంటే 24న కొత్త కోర్సుల కేటాయింపు జాబితాను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ <
News September 21, 2024
ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్
AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు చేసిన మహిళ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదులోని ఆరోపణలు అవాస్తవమని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.
News September 21, 2024
రాష్ట్రంలో పరువు హత్య
AP: అన్యమతస్థుడిని పెళ్లి చేసుకున్న కూతురిని పేరెంట్స్ హతమార్చిన ఘటన నెల్లూరు(D) పద్మనాభునిసత్రంలో జరిగింది. రమణయ్య, దేవసేనమ్మల చిన్నకూతురు శ్రావణి(24) భర్తతో విడిపోయింది. ఇటీవల రబ్బానీ బాషాను పెళ్లిచేసుకోగా తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి కొట్టడంతో చనిపోయింది. దీంతో ఇంటిపక్కనే పూడ్చిపెట్టారు. 25 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తల్లిదండ్రులను అరెస్టు చేశారు.