News May 26, 2024

వారణాసిలో పెద్దగా ప్రచారం అవసరం లేదు: జైశంకర్

image

వారణాసిలో బీజేపీ పెద్దగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. వారణాసిలో మరోసారి మోదీ గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసిన మోదీ జయకేతనం ఎగురవేశారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికపై భారత స్థాయిని చూసి ప్రజలు గర్విస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా చివరి విడత ఎన్నికల్లో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనుంది.

Similar News

News November 16, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎర్ర చందనం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు DSP మహేంద్ర తెలిపారు. మరో 8 మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
* గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఐదేళ్ల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

News November 16, 2025

మరో అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

News November 16, 2025

ఆ ఐదేళ్లు రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్: చంద్రబాబు

image

AP: 2019-24 కాలం రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సోలార్ రంగం అభివృద్ధి చెందకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ కారణంతోనే రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు తయారు చేస్తున్నామని చెప్పారు.