News June 4, 2024

వారణాసి : లక్షన్నర ఓట్ల మెజార్టీలో మోదీ

image

వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీకి ఆశించిన మెజారిటీ రావడం లేదు! అజయ్ రాయ్ ఆయనకు గట్టి పోటీనే ఇచ్చారు. ఈసీ ప్రకారం మోదీ 1,53,989 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 5,85,561 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి 4,31,572 ఓట్లు రావడం విశేషం. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి జమాల్ లారీకి 32 వేల పైచిలుకు ఓట్లు లభించాయి. ఇంకా ఇక్కడ ఎన్ని రౌండ్ల లెక్కింపు ఉంటుందో తెలియాల్సి ఉంది.

Similar News

News December 13, 2025

ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

image

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.

News December 13, 2025

బలి ‘గుమ్మడికాయ’తో ఇద్దామా?

image

అమ్మవార్లకు చాలామంది కోడి, మేకలను బలి ఇస్తారు. అయితే ఈ జంతు బలి కంటే కూడా గుమ్మడికాయ బలితోనే అమ్మవారు ఎక్కువ సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కూష్మాండాన్ని శిరస్సుకు ప్రతీకగా భావించి అమ్మవారికి దీన్ని సమర్పించాలని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ విధానమే శ్రేయస్కరమని చెబుతున్నాయి. అందుకే దసరాకి కూష్మాండాన్నే బలిస్తారు. ఇది హింస లేని, దైవ ప్రీతి కలిగించే ఉత్తమ మార్గం.

News December 13, 2025

మెస్సీతో ఫొటో రూ.10లక్షలు.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?

image

దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ భారత పర్యటన మొదలైంది. ఈ తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న ఆయన సాయంత్రానికి HYD రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫొటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు HYD గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27 వేల టికెట్లు బుక్ అయ్యాయి.