News February 1, 2025
వసంత పంచమి.. అక్షరాభ్యాసం చేయిస్తున్నారా?

రేపు సరస్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన వసంత పంచమి. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే విద్యా బుద్ధులు వరిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. దేశంలో చాలా ప్రసిద్ధ సరస్వతి ఆలయాలున్నాయి. అందులో బాసర (తెలంగాణ) ఒకటి. ఆ తర్వాత శారద పీఠం (కశ్మీర్), శృంగేరి శారదాంబ ఆలయం (కర్ణాటక), సరస్వతి ఆలయం (పుష్కర్- రాజస్థాన్), కూతనూర్ సరస్వతి ఆలయం (తమిళనాడు), విద్యా సరస్వతి ఆలయం (వర్గల్-TG) ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు?
Similar News
News December 5, 2025
లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్

* నటి, బిగ్బాస్ తెలుగు-3 కంటెస్టెంట్ పునర్నవి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. తన ప్రియుడు హేమంత్ వర్మ(ఫొటోగ్రాఫర్) కశ్మీర్లో చేసిన ప్రపోజల్కు ఓకే చెప్పినట్లు ఆమె ఇన్స్టాలో ఫొటోలు పంచుకున్నారు.
* సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి ‘షో మ్యాన్’ టైటిల్ ఫిక్స్ చేయగా దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుమన్ విలన్గా నటించనున్నారు.
News December 5, 2025
నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 5, 2025
పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.


