News June 29, 2024
పవన్ 25 రోజుల టైమ్ కేటాయిస్తే ‘వీరమల్లు’ పూర్తి: రత్నం
హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని నిర్మాత AM రత్నం చెప్పారు. ఆయన 20-25 రోజులు కేటాయిస్తే మిగతాది కంప్లీట్ అవుతుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పవన్ బిజీ షెడ్యూల్ను బట్టి షూటింగ్ ప్రణాళిక సిద్ధం చేస్తాం. డిసెంబర్లో మూవీ విడుదలకు ప్రయత్నిస్తాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో పవన్ యాక్షన్ సీన్స్ హైలైట్గా నిలుస్తాయి’ అని పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
ట్రిలియన్ డాలర్లు దాటిన భారత కుబేరుల సంపద!
భారత కుబేరుల సంపద మొత్తం కలిపి తొలిసారిగా ట్రిలియన్ డాలర్లను దాటిందని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. 2019తో పోలిస్తే వారి సంపద రెట్టింపైందని తెలిపింది. ఒక్క 2023లోనే వారు 316 బిలియన్ డాలర్లను సంపాదించారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ పాజిటివ్గా ఉందని కొనియాడింది. కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ (119.5 బిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో ఉన్నారు. అదానీ(116 బిలియన్ డాలర్లు) 2వ స్థానంలో నిలిచారు.
News October 11, 2024
బెల్లీ ల్యాండింగ్ అంటే ఏంటి..?
విమానం టేకాఫ్, ల్యాండింగ్లో ల్యాండింగ్ గేర్ అనేది కీలకం. ఇది విమాన చక్రాలు, స్ట్రట్స్, షాక్ అబ్సార్బర్స్తో అనుసంధానమై పనిచేస్తుంది. ఇందులో సమస్య ఏర్పడి చక్రాలు తెరుచుకోని పరిస్థితుల్లో బెల్లీ ల్యాండింగ్ చేస్తారు. అంటే విమానాన్ని చక్రాల ద్వారా కాకుండా నేరుగా విమానం మధ్య భాగం (బెల్లీ) భూమిని తాకేలా ల్యాండ్ చేస్తారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చివరి అవకాశంగా దీనికి అనుమతిస్తుంటారు.
News October 11, 2024
మెగాస్టార్తో విక్టరీ వెంకటేశ్: పిక్స్ వైరల్
‘విశ్వంభర’ సెట్స్లో మెగాస్టార్ చిరంజీవిని హీరో దగ్గుబాటి వెంకటేశ్ కలిశారు. ఆయనతోపాటు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ కూడా చిరును కలిసి సందడి చేశారు. కాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకీ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి, ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు చిరు నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్ రేపు ఉదయం హైదరాబాద్లోని మైత్రీ విమల్ థియేటర్లో విడుదల కానుంది.