News May 25, 2024
వెజి‘ట్రబుల్స్’.. రేట్లు డబుల్!

TG: వేసవి కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. 2 నెలల కిందట KG ₹20 ఉన్న టమాటా ధర ₹40కి చేరింది. క్యారెట్ ₹30 నుంచి ₹50కి, వంకాయ ₹30 నుంచి ₹60కి, పచ్చి మిర్చి ₹60 నుంచి ₹120కి, బీన్స్ ₹80 నుంచి ₹140కి రేట్లు పెరిగాయి. అన్ని వెజిటెబుల్స్ ధరలు రెట్టింపు అయ్యాయి. అన్ని మార్కెట్లలో ధరలు ఇలాగే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మీ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయి?
Similar News
News November 21, 2025
ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
News November 21, 2025
దేవుడు ఎంత గొప్పవాడంటే ?

యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||
సృష్టి ఆరంభంలో సమస్త ప్రాణులు దేని నుంచి ఉద్భవిస్తాయో, తిరిగి యుగం ముగిసే సమయంలో దేనిలో లయమైపోతాయో.. ఆ పరమ పవిత్ర పదార్థమే పరమాత్ముడు. ఆయన ఈ జగత్తును నడిపిస్తాడు. నిరంతరం జరిగే సృష్టి-లయ చక్రంలో ఆయనే ముఖ్యపాత్రుడు. అలాంటి భగవంతుడికి మన కోర్కెలు తీర్చడం పెద్ద విషయం కాదు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 21, 2025
సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. స్పౌజ్ కోటా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను ప్రభుత్వం ఈనెల 30 లోగా పూర్తి చేయనుంది. <<18316925>>అర్హులైన<<>> వారు ఈనెల 24లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 25, 26 తేదీల్లో పరిశీలించి, సీనియారిటీ ప్రకారం జాబితాలు ప్రకటిస్తారు. 29వ తేదీకల్లా బదిలీల ఆర్డర్ జారీ చేయడంతోపాటు సచివాలయాల కేటాయింపు పూర్తి చేయనున్నారు.


