News August 11, 2025
లోయలో పడిన వాహనం.. ఏడుగురి మృతి

మహారాష్ట్ర పుణే జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖేడ్ సమీపంలోని మహాలుంగే ప్రాంతంలో టెంపో వాహనం లోయలో పడిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటన జరిగిన సమయంలో 30 మంది వరకూ అందులో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. శ్రావణ సోమవారం సందర్భంగా వీరంతా కుందేశ్వర్ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News January 20, 2026
తగలబెట్టేయండి.. అమెరికాపై ఫ్రాన్స్ సెటైర్లు!

గ్రీన్లాండ్పై రష్యా దాడి చేస్తే తాము <<18893308>>జోక్యం చేసుకోవాల్సి<<>> ఉంటుందని, అందుకే ఇప్పుడే స్వాధీనం చేసుకుంటామన్న US వ్యాఖ్యలపై ఫ్రాన్స్ సెటైర్లు వేసింది. ‘అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ ఫైటర్లు జోక్యం చేసుకుంటారు. అందుకే ఇప్పుడే ఇంటిని తగలబెట్టేయండి. షార్క్ దాడి చేస్తే ఎవరైనా అడ్డుకుంటారు. లైఫ్గార్డును ఇప్పుడే తినేద్దాం. యాక్సిడెంట్ జరిగితే నష్టం కలుగుతుంది. కారును ధ్వంసం చేయండి’ అని ట్వీట్ చేసింది.
News January 20, 2026
22 వేల పోస్టులు.. దరఖాస్తుల తేదీలివే!

22 వేల గ్రూప్-D పోస్టుల భర్తీకి ఈ నెల 30న RRB పూర్తిస్థాయి నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 21 నుంచి కాకుండా 31వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మార్చి 2 వరకు గడువు విధించనుంది. టెన్త్, ITI అర్హత కలిగిన, 18-33 ఏళ్ల వయసు వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి ఏజ్లో సడలింపు ఉంటుంది. నెలకు జీతం ₹18,000 చెల్లిస్తారు.
వెబ్సైట్: www.rrbchennai.gov.in/
News January 20, 2026
40 ఏళ్లు వచ్చాయా.. లేఆఫ్స్ ముప్పు!

ఉద్యోగికి 40 ఏళ్లు వచ్చాయంటే కెరీర్లో ముఖ్యమైన దశలో ఉన్నారని అర్థం. వీరి 15 ఏళ్ల అనుభవం, నైపుణ్యంతో కంపెనీకి అసెట్గా భావిస్తారు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ లేఆఫ్స్ ఎఫెక్ట్ ఈ ఏజ్ ఉద్యోగులపైనే పడుతోంది. ప్రమోషన్లు ఉండటం లేదు. జాబ్ మారుదామంటే ‘మీరు ఓవర్ క్వాలిఫైడ్. ఫ్రెషర్స్, చురుకైన వారు కావాలి’ అని రిక్రూటర్లు చెబుతున్నారు. తక్కువ జీతాలకు ఫ్రెషర్లు దొరకడం కూడా వీరిని వదిలించుకోవడానికి మరో కారణం.


