News October 9, 2024

వాహనాలు 15ఏళ్లు దాటినా వాడుకోవచ్చు కానీ..

image

TG: రాష్ట్రంలో 15ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. ఆ వాహనాలు ఫిట్‌గా ఉన్నాయనిపిస్తే నడుపుకోవచ్చు. అయితే తదుపరి 5ఏళ్లకు ₹5K, మరో పదేళ్లకు ₹10K గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా వద్దా అనేది యజమాని నిర్ణయించుకుంటారు. మారిస్తే తర్వాతి వాహనానికి రాయితీ వస్తుంది.

Similar News

News March 7, 2025

దేశానికి యువత ఎక్స్‌ఫ్యాక్టర్: PM మోదీ

image

భారత్ నేడు ప్రపంచ వృద్ధిని నడిపిస్తోందని, యువత దేశానికి ఎక్స్‌ఫ్యాక్టర్ అని PM మోదీ అన్నారు. దేశ భద్రతపై NDA ఎంతో శ్రద్ధ చూపుతోందని ఢిల్లీలో జరిగిన ఓ ప్రోగ్రాంలో వివరించారు. గ్రామాల్లో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతే, పట్టణ ప్రాంతాల్లో వ్యాపిస్తోందన్నారు. కొన్ని రాజకీయ పార్టీల మాటల్లో నక్సలిజం భావజాలం కన్పిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో స్లీపర్ సెల్స్, ఉగ్రదాడులు అదృశ్యమైనట్లు చెప్పారు.

News March 7, 2025

అల్లు అర్జున్, స్నేహా బంధానికి పద్నాలుగేళ్లు

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ పద్నాలుగో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. 2011లో స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కించబోయే సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు టాక్.

News March 7, 2025

పంజాబ్ కింగ్స్ న్యూ జెర్సీ చూశారా?

image

ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మెటాలిక్ ఎంబ్లమ్, గోల్డ్ కాలర్, గోల్డ్ ఫాయిల్ స్ట్రిప్స్, అథెంటిక్ లేబుల్‌తో జెర్సీ సరికొత్తగా ఉంది. రెడ్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ హెల్మెట్‌తో కిట్‌ను విభిన్నంగా రూపొందించారు. కాగా తమ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఆ ఫ్రాంచైజీ నియమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో ఆయన జట్టును ముందుండి నడిపించనున్నారు.

error: Content is protected !!