News October 9, 2024
వాహనాలు 15ఏళ్లు దాటినా వాడుకోవచ్చు కానీ..

TG: రాష్ట్రంలో 15ఏళ్లు దాటిన వాహనాలను తప్పనిసరిగా తుక్కుగా మార్చాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ‘వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ’ని అమల్లోకి తెచ్చింది. ఆ వాహనాలు ఫిట్గా ఉన్నాయనిపిస్తే నడుపుకోవచ్చు. అయితే తదుపరి 5ఏళ్లకు ₹5K, మరో పదేళ్లకు ₹10K గ్రీన్ ట్యాక్స్ చెల్లించాలి. పాత వాహనాన్ని తుక్కుగా మార్చాలా వద్దా అనేది యజమాని నిర్ణయించుకుంటారు. మారిస్తే తర్వాతి వాహనానికి రాయితీ వస్తుంది.
Similar News
News February 2, 2026
కాంగ్రెస్ ప్రభుత్వ పెట్టుబడులన్నీ కట్టుకథలే: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న పెట్టుబడులన్నీ కట్టు కథలేనని జాగృతి చీఫ్ కవిత విమర్శించారు. ‘సింగపూర్ గేట్వే సంస్థకు వెబ్సైటూ లేదు. ₹70వేల CR పెట్టుబడి అన్న ఇన్ఫ్రా కీ డేటా సెంటర్ పార్క్ కంపెనీ USలో ₹90వేల CR, బ్రెజిల్లో ₹70వేల CRకు MOU చేసింది. గతేడాదే ఏర్పాటైన ఇది MOUల కోసమే పుట్టినట్లుంది. జయవీర్ రెడ్డి కంపెనీ నిజమైనదో కాదో చెప్పాలి. ₹10L లేని కంపెనీలు ₹వేలకోట్ల MOUలు చేశాయి’ అని అన్నారు.
News February 2, 2026
Budget: గోల్డ్ బాండ్స్ ఇకపై ట్యాక్స్ ఫ్రీ కాదా?

బడ్జెట్లో గోల్డ్ బాండ్ల పన్ను మినహాయింపును కుదించారు. ఇకపై RBI ఈ బాండ్లను ఇష్యూ చేసినప్పుడే నేరుగా కొని మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటేనే పన్ను ఉండదు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే మెచ్యూరిటీ సమయంలో వచ్చే లాభంపై కచ్చితంగా ట్యాక్స్ కట్టాల్సిందే. అలాగే మెచ్యూరిటీ కంటే ముందు అమ్మినా పన్ను తప్పదు. అయితే ఏటా వచ్చే 2.5% వడ్డీపై పాత పద్ధతిలోనే పన్ను వర్తిస్తుంది.
News February 2, 2026
అభిషేక్ శర్మపై రికీ పాంటింగ్ ప్రసంశలు

T20 WCలో భారత స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టాప్ స్కోరర్గా నిలుస్తాడని ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. అతడే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం T20 నంబర్ వన్ ర్యాంకర్గా ఉన్న అభిషేక్, తన మెరుపు బ్యాటింగ్తో భారత్ను విజేతగా నిలుపుతాడని పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత్, శ్రీలంక వేదికలుగా FEB 7 నుంచి మొదలవనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడుతున్నాయి.


