News August 2, 2024
వేమన నీతి పద్యం- తాత్పర్యం

గొడ్డుటావు బితుక గుండ గొంపోయిన
బండ్ల నూడ దన్ను పాల నీదు
లోభివాని నడుగ లాభంబు లేదయా
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: గొడ్డు ఆవు దగ్గరకి పాలు పిండటానికి పోతే తంతుందేగానీ పాలు ఇవ్వదు. అలాగే పిసినిగొట్టు వాడిని ఎంత ప్రాధేయపడినా నోరు నొప్పి పుడుతుందే కాని పైసా కూడా వాని నుంచి పొందలేము.
Similar News
News November 8, 2025
TODAY HEADLINES

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం
News November 8, 2025
వాట్సాప్లో క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

వాట్సాప్ క్రాస్ ప్లాట్ఫామ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.
News November 8, 2025
ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో ఎంతంటే..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపాన్ ఉత్పత్తి చేస్తోంది. ‘కిన్మెమై ప్రీమియం’ రకం బియ్యం ధర KG ₹12,500 పలుకుతోంది. 2016లో 840 గ్రా.కు ₹5,490 ధరతో ఖరీదైన బియ్యంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రపంచంలోనే విలువైన, ఉత్తమమైన ధాన్యాలు, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, ప్రాసెసింగ్ వల్ల వీటికి ఇంత విలువ. వడ్లను వివిధ దశల్లో బియ్యంగా మారుస్తారు. కడగాల్సిన అవసరం లేకుండానే వండుకోగలగడం మరో స్పెషాలిటీ.


