News October 29, 2024
CBI డీఐజీగా వెంకటసుబ్బారెడ్డి

సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్గా ఐపీఎస్ వెంకటసుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన పదవిలో ఉంటారని పేర్కొంది. 2007 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన ఈయన స్వరాష్ట్రం ఏపీ. ప్రస్తుతం షిల్లాంగ్గా సీఐడీ డీఐజీగా పనిచేస్తున్నారు. వెంటనే ఆయన్ను రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
Similar News
News October 30, 2025
పత్తిలో 20% తేమ ఉన్నా కొనండి.. CCIకి లేఖ

TG: భారీ వర్షాల నేపథ్యంలో పత్తిలో 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని CCIకి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ మల్లు రవి లేఖ రాశారు. తేమ పెరగడం వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే రబీ సీజన్ కోసం నెలకు 2 లక్షల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కాగా క్షేత్రస్థాయిలో పత్తిలో 12% తేమ దాటితే <<18118478>>మద్దతు ధర<<>> దక్కడం లేదు.
News October 30, 2025
ఏడాది తర్వాత పిల్లలకు ఏం పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏడాది దాటాక కూడా పిల్లలకు పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి అన్నం పెడుతుంటారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. వారికి ఏడాది దాటాక నెమ్మదిగా అన్నిరకాల ఆహారాలు అలవాటు చెయ్యాలి. కిచిడీ, పొంగల్, పాలకూర పప్పు, వెజిటబుల్ రైస్ వంటివి తినిపించాలంటున్నారు.
News October 30, 2025
అజహరుద్దీన్కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


