News March 16, 2024

తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి వేణుంబాక

image

ముత్తుకూరు మండలం తాళ్లపూడికి చెందిన వేణుంబాక విజయసాయి రెడ్డి వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్య నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విజయసాయి రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. ఆయన ప్రత్యర్థిగా వేమిరెడ్డి ఉన్నారు.

Similar News

News September 29, 2024

నెల్లూరు: వదినను చంపిన వ్యక్తి అరెస్ట్

image

గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నూరులో వదినను హత్య చేసిన కేసులో ముద్దాయి పాలెపు రమేశ్‌ను శనివారం అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై పి మనోజ్ కుమార్ తెలిపారు. తిప్పవరప్పాడు జంక్షన్ వద్ద గూడూరు రూరల్ CI , SI, సిబ్బందితో కలిసి అరెస్టు చేశామని అన్నారు.

News September 29, 2024

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు: కలెక్టర్

image

ఈవీఎంల గోడౌన్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. త్రైమాసిక తనిఖీల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ గోడౌన్ల లోని ఈవీఎంలు, వివి ప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు.

News September 28, 2024

వేదాయపాలెం రైల్వే స్టేషన్‌లో వృద్ధురాలు

image

నెల్లూరు నగరం వేదయపాలెం రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలను వదిలేసి వెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ప్రయాణికులు 108 సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ఆమెను వివరాలు అడగగా.. తన పేరు బుజ్జమ్మని మిగిలిన వివరాలు చెప్పలేకపోయిందని అధికారులు తెలిపారు.