News June 20, 2024
నేటి నుంచి గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

TG: నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఆగస్టు 21వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే అభ్యర్థులకు హాల్టికెట్ నంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను <
Similar News
News November 16, 2025
భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్సైట్: https://serc.res.in/
News November 16, 2025
మేం కాంగ్రెస్కు కాదు.. నవీన్కు సపోర్టు చేశాం: అసదుద్దీన్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్కు సపోర్టు చేశామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కానీ కాంగ్రెస్కు మద్దతిచ్చినట్లుగా కొందరు అర్థం చేసుకున్నారన్నారు. నియోజకవర్గాన్ని నవీన్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ అయినా, తానైనా మా పార్టీలకు మంచి అనిపించేది చేసుకుంటూ వెళ్తామని చెప్పారు.
News November 16, 2025
19న అకౌంట్లలోకి రూ.7,000?

AP: PM కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2వేల చొప్పున జమ చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం. PM కిసాన్తోపాటు ‘సుఖీభవ’ స్కీమ్నూ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే AUGలో తొలి విడత నిధులను రిలీజ్ చేశారు.


