News March 9, 2025
ఆసుపత్రిలో చేరిన ఉప రాష్ట్రపతి ధన్ఖడ్

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అస్వస్థతకు గురయ్యారు. అర్ధరాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. ప్రస్తుతం ధన్ఖడ్ను క్రిటికల్ కేర్ యూనిట్(CCU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కార్డియాలజీ విభాగం అధిపతి డా. రాజీవ్ నారంగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది.
Similar News
News November 21, 2025
రాష్ట్రంలో 32మంది IPSల బదిలీ

TG: పంచాయతీ ఎన్నికల వేళ 32మంది IPSలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ADG పర్సనల్గా చౌహాన్, CID DIGగా పరిమళ నూతన్, మహేశ్వరం DCPగా నారాయణరెడ్డి, తెలంగాణ నార్కోటిక్ SPగా పద్మ, నాగర్ కర్నూల్ SPగా సంగ్రామ్ పాటిల్, సౌత్ జోన్ DCPగా కిరణ్ కారే, వనపర్తి SPగా సునీత, మల్కాజ్గిరి DCPగా శ్రీధర్, ఆసిఫాబాద్ SPగా నిఖితా పంత్, TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో SPగా గిరిధర్ తదితరులు బదిలీ అయ్యారు.
News November 21, 2025
మత్స్యకారులకు అండగా వైసీపీ: జగన్

AP: మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని YCP అధ్యక్షుడు జగన్ తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. వారి సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
DoPTకి లేఖ రాసిన ACB

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.


