News April 17, 2024
VIDEO: సమస్యలను పరిష్కరించాలని విరుపాక్షిని గ్రామస్థుల నీలదీత
ఆస్పరిలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షిని గ్రామస్థులు నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామంలో అభివృద్ధి జరగలేదని, సమస్యలను ఎందుకు పరిష్కరించలేదంటూ ఎన్నికల ప్రచారానికి
వచ్చిన విరుపాక్షిని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానంటూ సముదాయించటానికి ప్రయత్నించినప్పటికీ
వినకపోవడంతో విరుపాక్షి అక్కడి నుంచి వెనుదిరిగారు.
Similar News
News September 30, 2024
నంద్యాల: చెరువులో శిశువు మృతదేహం కలకలం
నంద్యాల పట్టణంలోని చెరువులో నెల వయసున్న శిశువు మృతదేహం సోమవారం కలకలం సృష్టించింది. అటుగా వెళుతున్న కొందరు సమాచారాన్ని పోలీసులకు అందించారు. చెరువు దగ్గరికి వచ్చి శిశువును పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. చెరువులో బతికి ఉన్న శిశువును పడేశారా లేదా చనిపోయిన శిశువును పడేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News September 30, 2024
దసరాకు 758 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.
News September 30, 2024
దసరాకు 758 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.