News September 13, 2024
స్నానాలు చేస్తుండగా వీడియో రికార్డ్ చేసింది: విద్యార్థినులు

TG:సిరిసిల్ల(D) తంగళ్లపల్లి గురుకుల స్కూలు విద్యార్థినుల కష్టాలు కలచివేస్తున్నాయి. 5ఏళ్లుగా అక్కడే తిష్ట వేసిన PET జోత్స్న మానసికంగా, శారీరకంగా తమను వేధిస్తోందని, నెలసరిలోనూ ప్రేయర్కు రావాలంటోందని గోడు వెళ్లబోసుకున్నారు. ప్రార్థన టైంలో ఎందుకు స్నానాలు చేస్తున్నారంటూ బాత్రూం తలుపులు పగులగొట్టి ఫోన్లో వీడియో తీసి కర్రతో కొట్టడం భరించలేక రోడ్డెక్కారు. విషయం తెలిసి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు.
Similar News
News February 14, 2026
70 స్థానాల్లో ఎంఐఎం విజయం.. భైంసా దక్కేనా!

TG: అసదుద్దీన్ ఒవైసీ పార్టీ MIM రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 70 వార్డు/డివిజన్ స్థానాల్లో విజయం సాధించింది. నిజామాబాద్ కార్పొరేషన్(60)లో కింగ్ మేకర్గా నిలిచిన ఈ పార్టీ(14 సీట్లు), భైంసా మున్సిపాలిటీలో మెజార్టీకి 2 సీట్ల దూరంలో ఉంది. రెబల్స్, కాంగ్రెస్ మద్దతుతో పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీ చీఫ్ అసదుద్దీన్ మంతనాలు చేస్తున్నారు. బోధన్లోనూ MIM 12 వార్డులు గెలుచుకుంది.
News February 14, 2026
గులాబీ పురుగు ఆశించిన పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గులాబీ రంగు పురుగు ఆశించిన పత్తిని రైతులు ఇళ్ల వద్ద గానీ, జిన్నింగ్ మిల్లుల వద్దగానీ నిల్వ ఉంచకూడదు. లింగాకర్షక బుట్టలను పత్తి జిన్నింగ్ మిల్లుల్లో అమర్చడం వల్ల మగ పురుగులను ఆకర్షించి తర్వాతి సంతతిని నివారించవచ్చు. ఈ పురుగు అధికంగా ఆశించిన ప్రాంతాల నుంచి పత్తిని లేదా విత్తనాన్ని వినియోగించడానికి తీసుకురాకూడదు. గులాబీ రంగు పురుగు కట్టడికి గ్రామాల మధ్య సమన్వయం చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు.
News February 14, 2026
కార్పొరేషన్లలో ‘కారు’ డౌన్

TG: మున్సిపాలిటీల్లో సుమారు 13 చోట్ల గెలిచిన BRS.. కార్పొరేషన్లలో మాత్రం డీలా పడిపోయింది. 7 చోట్ల ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. మొత్తం 414 డివిజన్లలో 63 చోట్ల మాత్రమే విజయం సాధించింది. NZBలో 60 డివిజన్లు ఉండగా కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. కరీంనగర్, నిజామాబాద్, కొత్తగూడెంలో మూడో స్థానానికి పరిమితమైంది. పంచాయతీ ఎన్నికల్లో కాస్త ఫర్వాలేదనిపించినా నగర ప్రజలు పక్కనబెట్టినట్లు అర్థమవుతోంది.


