News September 28, 2024

వందే భార‌త్ రైళ్లపై ఇతర దేశాల చూపు!

image

వందే భార‌త్ రైళ్ల‌ను దిగుమ‌తి చేసుకొనేందుకు చిలీ, కెనడా, మలేషియా వంటి దేశాలు ఆస‌క్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ త‌ర‌హా రైళ్లు ఇత‌ర దేశాల నుంచి కొనుగోలుకు రూ.160-180 కోట్లు అవుతుంద‌ని, అదే భార‌త్ వీటిని రూ.120-130 కోట్ల‌కే త‌యారు చేస్తుండ‌డ‌మే ఈ దేశాల ఆస‌క్తికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. జ‌పాన్ బుల్లెట్ రైలు 0-100 KPHకు చేరుకోవ‌డానికి 54 సెకన్లు పడుతుంది. వందేభార‌త్‌‌ 52 సెకన్లలో చేరుకుంటుంది.

Similar News

News February 1, 2026

‘ఫార్మర్ రిజిస్ట్రీ’లో పేరు నమోదు చేసుకోకపోతే..

image

AP: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్రం ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ నమోదును చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఇప్పటికీ 13L మంది రిజిస్టర్ చేసుకోలేదు. వీరు PM కిసాన్-అన్నదాత సుఖీభవ(ఏటా ₹20K) నిధులు పొందలేరని వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ వెల్లడించారు. రైతు సేవా కేంద్రాలు లేదా APAIMS 2.0 యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ-పంట నమోదునూ రైతులే యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు.

News February 1, 2026

2 గంటలుగా కేసీఆర్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ రెండు గంటలుగా విచారిస్తోంది. అధికారులు ఏం ప్రశ్నలు అడిగారు? ఆయన ఏం సమాధానాలిచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే కేసులో ఇప్పటికే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీలు రాధాకిషన్ రావు, తిరుపతన్న, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్‌లను సిట్ విచారించిన విషయం తెలిసిందే.

News February 1, 2026

పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

image

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.