News June 22, 2024
మధ్యప్రదేశ్కు ఆడేందుకు ‘నో’ చెప్పిన విహారి

దేశవాళీ మ్యాచుల్లో మధ్యప్రదేశ్ తరఫున ఆడేందుకు భారత క్రికెటర్ హనుమ విహారి నో చెప్పారు. కోచ్ చంద్రకాంత్కు తన నిర్ణయాన్ని వెల్లడించి క్యాంపును వీడారు. గతంలో ACAతో వివాదం నెలకొనగా MP తరఫున ఆడాలని విహారి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు అనూహ్యంగా తన డెసిషన్ను మార్చుకున్నారు. దీనిపై కోచ్ పండిత్ అసహనం వ్యక్తం చేశారు. కాగా విహారి తిరిగి ఆంధ్రా జట్టుతో చేరతారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Similar News
News December 4, 2025
భారతీయుడికి జాక్పాట్.. లాటరీలో రూ.61కోట్లు!

సౌదీలో ఉంటున్న భారతీయుడు PV రాజన్కు ‘బిగ్ టికెట్ డ్రా సిరీస్ 281’లో జాక్పాట్ తగిలింది. అబుధాబిలో లక్కీ డ్రా తీయగా NOV 9న అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్-282824 నంబరుకు 25M దిర్హమ్స్(రూ.61.37కోట్లు) వచ్చాయి. ఓ కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్గా పని చేసే రాజన్ 15ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నారు. గత నెల కూడా ‘బిగ్ టికెట్’ లక్కీ డ్రాలో TNకు చెందిన వెంకటాచలం విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్కు సమానంగా ఉండేది.


