News August 27, 2025
‘త్రిపుర’కు ఆడనున్న విహారి.. YCP ప్రశ్నలు!

దేశవాళీ క్రికెట్లో ఇక నుంచి తాను త్రిపుర జట్టుకు ఆడబోతున్నట్లు AP క్రికెటర్ హనుమ విహారి ప్రకటించారు. బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘నా ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు అనుమతించే వేదిక కోసమే ఈ మార్పు’ అని పేర్కొన్నారు. దీనిపై YCP స్పందిస్తూ ‘గతంలో YCP ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విహారి ఇప్పుడెందుకు విసుగు చెందాడు? అతనికి ఎవరు అవకాశాలివ్వట్లేదు?’ అని ప్రశ్నించింది.
Similar News
News August 27, 2025
ఆ దేశాలతో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందాలు: ట్రంప్

యూకే, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, జపాన్, దక్షిణ కొరియా, EU దేశాలతో చారిత్రాత్మక ఒప్పందాలు చేసుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆయా దేశాలు బిలియన్ల డాలర్లు US ట్రెజరీకి చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. అటు భారత్పై ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా అదనంగా విధించిన టారిఫ్స్ IST ప్రకారం ఇవాళ ఉ.9.31 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో భారత ఎగుమతులపై టారిఫ్స్ 50శాతానికి చేరుతాయి.
News August 27, 2025
ఎంగేజ్మెంట్ చేసుకున్న సింగర్ టేలర్ స్విఫ్ట్

ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన ప్రియుడిని పెళ్లి చేసుకోనున్నారు. NFL ప్లేయర్ ట్రావిస్ కెల్సేతో రెండేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ బ్యూటీ నిన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు IGలో పోస్ట్ చేశారు. ‘మీ ఇంగ్లిష్ టీచర్, జిమ్ టీచర్ వివాహం చేసుకోబోతున్నారు’ అని రాసుకొచ్చారు. తనను తాను ఇంగ్లిష్ టీచర్గా టేలర్ పేర్కొనడంపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడనే విషయాన్ని వెల్లడించలేదు.
News August 27, 2025
పంచాయతీలకు రూ.1,120 కోట్ల విడుదలకు సీఎం హామీ: పవన్

AP: సెప్టెంబర్ మొదటి వారంలో పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కానున్నట్లు Dy.CM పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. రూ.1,120 కోట్ల విడుదలకు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు వినియోగిస్తూ కనీస మౌలిక వసతులు, సేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.