News July 8, 2024
OTTలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి సినిమా
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
Similar News
News October 6, 2024
అది ఐపీఎల్ టోర్నీలోనే అతిపెద్ద మూవ్ అవుతుంది: ఏబీడీ
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సీజన్లో రోహిత్ శర్మ ఆర్సీబీలో చేరాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే అతి పెద్ద మూవ్ కానుందని అభిప్రాయపడ్డారు. అయితే రోహిత్ ముంబైని వీడే అవకాశం 0.1శాతమేనని పేర్కొన్నారు. అది కూడా జరిగే అవకాశం లేదన్నారు. మరోవైపు గత సీజన్లో ముంబై కెప్టెన్గా రోహిత్ను తప్పించిన సంగతి తెలిసిందే.
News October 6, 2024
18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!
అధిక రాబడులు ఆశచూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెరల్ ఆగ్రో కార్పొరేషన్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
News October 6, 2024
ఈ పండును తిన్నారా?
విదేశాల నుంచి మనకు పరిచయమైన పండ్లలో రాంబూటన్ పండు ఒకటి. పైన ఎర్రగా ముళ్లలాగా, లోపల కండ భాగం తెల్లగా ఉంటుంది. ఈ పండు తీపి, పుల్లటి రుచులు కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. చర్మం ఆరోగ్యంగా ఉంటుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. మరి ఈ పండును మీరు తిన్నారా? కామెంట్ చేయండి.