News October 20, 2024

NCW ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్

image

జాతీయ మహిళా కమిషన్(NCW) ఛైర్‌పర్సన్‌గా విజయా కిశోర్ రహాట్కర్, సభ్యురాలిగా అర్చనా మజుందార్ నియమితులయ్యారు. విజయ మూడేళ్లపాటు/65ఏళ్లు వచ్చే వరకు, అర్చన మూడేళ్లు పదవుల్లో కొనసాగుతారని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. విజయ NCWకు తొమ్మిదవ ఛైర్‌పర్సన్. బీజేపీకి చెందిన ఈమె 2007-10 మధ్య ఛత్రపతి శంభాజీనగర్ మేయర్‌గా సేవలందించారు. 2016-21 మధ్య మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు.

Similar News

News November 7, 2025

శుభ సమయం (07-11-2025) శుక్రవారం

image

✒ తిథి: బహుళ విదియ మ.2.28 వరకు
✒ నక్షత్రం: కృతిక ఉ.6.58 వరకు
✒ శుభ సమయాలు: ఉ.10.05-10.35, సా.5.40-6.10
✒ రాహుకాలం: ఉ.10.30-12.00
✒ యమగండం: మ.3.00-సా.4.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-9.12, మ.12.24-1.12
✒ వర్జ్యం: రా.9.52-11.22
✒ అమృత ఘడియలు: శే. అమృతం ఉ.6.45 వరకు, రా.2.21-3.50

News November 7, 2025

TODAY TOP STORIES

image

* చొరబాటుదారులను కాపాడే పనుల్లో RJD, కాంగ్రెస్ బిజీ: మోదీ
* బిహార్‌లో ముగిసిన తొలి విడత పోలింగ్.. 64.66% ఓటింగ్ నమోదు
* డిజిలాకర్‌లో సర్టిఫికెట్లు, హెల్త్ రికార్డులు: CM CBN
* చంద్రబాబుకు షాకిచ్చేలా ఉద్యమాలు: జగన్
* BRS ఫేక్ సర్వేలను తిప్పికొట్టండి: CM రేవంత్
* రేవంత్‌కు రోషముంటే KTRను జైల్లో పెట్టాలి: బండి సంజయ్
* T20లో ఆసీస్‌పై భారత్ విక్టరీ.. సిరీస్‌లో 2-1 లీడ్

News November 7, 2025

మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

image

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్‌పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.