News June 6, 2024

ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్?

image

APకి కొత్త సీఎస్‌గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం APSPDCL ఛైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్‌ను CSగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగానూ ఆయన వ్యవహరించారు.

Similar News

News October 23, 2025

జామలో తెల్ల సుడిదోమ వల్ల నష్టాలు – నివారణ

image

తెల్ల సుడిదోమ ఆకుల అడుగు భాగాన వలయాకారంలో గుడ్లను పెడతాయి. ఆకులపై తెల్లని దూదిలాంటి మెత్తని పదార్ధాన్ని కప్పి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులు ఎర్రబడి, ముడతలు పడి రాలిపోతాయి. వీటి నివారణకు రాత్రివేళ పసుపు రంగు జిగురు పూసిన అట్టలను చెట్ల వద్ద ఉంచాలి. సుడిదోమ ఆశించిన కొమ్మలను కత్తిరించి లీటరు నీటిలో 5ml వేపనూనె కలిపి పిచికారీ చేయాలి. ఇమిడాక్లోప్రిడ్-75% WGని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News October 23, 2025

ESIC నోయిడాలో కేవలం ఇంటర్వ్యూతోనే ఉద్యోగాలు

image

ESIC నోయిడా 20 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంబీబీఎస్, డీఎన్‌బీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు నవంబర్ 4న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://esic.gov.in/

News October 23, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి ₹1,25,080కు చేరింది. 22 క్యారెట్ల 10g పసిడిపై రూ.750 పతనమై ₹1,14,650గా ఉంది. అటు KG వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.