News June 6, 2024
ఏపీ కొత్త సీఎస్గా విజయానంద్?

APకి కొత్త సీఎస్గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని సెలవుపై వెళ్లాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం APSPDCL ఛైర్మన్, ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయానంద్ను CSగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగానూ ఆయన వ్యవహరించారు.
Similar News
News September 11, 2025
అధిక పాలనిచ్చే ‘జఫరాబాది’ గేదెలు

జఫరాబాది జాతి గేదెలు గుజరాత్కు చెందినవి. వీటి కొమ్ములు మెలి తిరిగి ఉంటాయి. పొదుగు విస్తారంగా ఉంటుంది. నలుపు రంగులో ఉండే వీటి శరీర బరువు దాదాపు 460KGలు ఉంటుంది. ఇవి మొదటిసారి 36-40 నెలలకు ఎదకు వస్తాయి. 48-51 నెలల వయస్సులో మొదటి దూడకు జన్మనిస్తాయి. రోజుకు 15-18 లీటర్ల చొప్పున పాడి కాలంలో 2,336 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తాయి. వెన్న 9-10% వరకు వస్తుంది. ఒక్కో గేదె ధర రూ.80K-రూ.లక్ష వరకు ఉంటుంది.
News September 11, 2025
మొక్కజొన్న: ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ

* పూత దశలో మొక్కజొన్న పంటకు 50KGల యూరియా, 20KGల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసి, నీటి తడిని ఇవ్వాలి.
* పేను బంక ఆశిస్తే డైమిథోయేట్ 30EC 2 ML లీటరు నీటికి, ఆకుమచ్చ, ఆకు మాడు తెగుళ్లు ఆశిస్తే 2.5గ్రా. మ్యాంకోజెబ్/1మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* కాండం కుళ్లు తెగులు కనిపిస్తే 100KGల వేప పిండి, 4KGల 35% క్లోరిన్ కలిగిన బ్లీచింగ్ పౌడర్ను కలిపి మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి.
News September 11, 2025
గ్రూప్-1పై జుడీషియల్ కమిషన్ వేయాలి: కేటీఆర్

TG: హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్-1 పరీక్షను మళ్లీ తాజాగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసింది. అవకతవకలపై జుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న మోసపూరిత వాగ్దానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.