News December 29, 2024

ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్?

image

AP: ఏపీ నూతన సీఎస్‌గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి.

Similar News

News November 22, 2025

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

image

AP: బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. ఇది సోమవారానికి వాయుగుండంగా మారి బుధవారానికి తుఫానుగా బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ప్రకాశం, NLR, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.

News November 22, 2025

ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. సన్నాహాలు షురూ!

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారుచేయగానే నోటిఫికేషన్ విడుదలచేసే ఛాన్స్ ఉంది. కాగా APలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.

News November 22, 2025

ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

image

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.