News October 27, 2024
విజయసాయి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే: షర్మిల
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ మోచేతి నీళ్లు తాగినవారే అని PCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. జగన్ మాటలే ఆయన మాట్లాడుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘విజయసాయి గారూ, మీరు చదివింది జగన్ స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తులు నలుగురు బిడ్డలకు చెందాలని YS నిర్ణయించారు. కాదని ఆయన చెప్పగలరా? ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఈ వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదని మాట ఇస్తున్నా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News October 27, 2024
పవన్ కళ్యాణ్తో సినీ నటుడు పార్థిబన్ భేటీ
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ నటుడు, డైరెక్టర్ పార్థిబన్ భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా పార్థిబన్ దాదాపు 70కిపైగా సినిమాల్లో నటించారు. 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
News October 27, 2024
దీపావళి కానుక ఇదేనా చంద్రబాబు: జగన్
AP: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ప్రతిపాదనపై YCP చీఫ్ జగన్ సెటైర్లు వేశారు. ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక కరెంట్ ఛార్జీలు పెంచడమేనా చంద్రబాబు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవారిమని చెప్పి, ఇప్పుడు భారీ స్థాయిలో పెంచి మాట తప్పడమే చంద్రబాబు నైజమని రుజువు చేశారని విమర్శించారు. ఈ విషయమై వైసీపీపై నిందలు వేయడం ఎంత వరకు సమంజసమన్నారు.
News October 27, 2024
పాకిస్థాన్ కెప్టెన్గా మహ్మద్ రిజ్వాన్
పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ను పీసీబీ నియమించింది. త్వరలో జరగబోయే ఆస్ట్రేలియా, జింబాబ్వే సిరీస్లో ఆయన జట్టుకు సారథ్యం వహిస్తారు. సల్మాన్ అలీ అఘాను వైస్ కెప్టెన్గా నియమించింది. టెస్టులకు షాన్ మసూద్ కెప్టెన్సీ చేస్తున్నారు. కాగా వన్డే, టీ20 కెప్టెన్సీకి బాబర్ ఆజమ్ ఇటీవల గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.