News February 2, 2025

షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ?

image

AP: రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో YCP మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. 3 రోజుల కిందట హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో దాదాపు 3 గంటల పాటు సమావేశం అయినట్లు సమాచారం. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇటీవల వైసీపీ, రాజకీయాలకు గుడ్ బై చెప్పిన VSR షర్మిలతో రహస్యంగా భేటీ కావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

Similar News

News December 9, 2025

టీ20ల్లో మనదే డామినేషన్.. కానీ!

image

టీ20ల్లో ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 31 T20 మ్యాచులు జరగగా భారత్ 18, SA 12 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచులో ఫలితం రాలేదు. అయితే సొంతగడ్డపై ఆడిన 12 మ్యాచుల్లో ఇండియా ఐదింట్లో నెగ్గగా దక్షిణాఫ్రికా ఆరు మ్యాచుల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో రిజల్ట్ రాలేదు. కాగా కటక్‌లో ఆడిన రెండు టీ20ల్లో దక్షిణాఫ్రికానే విజయం సాధించడం గమనార్హం.

News December 9, 2025

ఎర్లీ ప్యూబర్టీ ఎందుకొస్తుందంటే?

image

పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్లు, అధికబరువు, కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే ఇంట్లో వండిన ఆహారాన్నే తినడం, రసాయనాల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

News December 9, 2025

శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నారా?

image

శ్రీశైలం సముద్ర మట్టానికి 1,500Ft ఎత్తులో, 2,830Ft శిఖరం కలిగిన పవిత్ర క్షేత్రం. కృతయుగంలో హిరణ్యకశ్యపునికి పూజామందిరంగా, రాముడు, పాండవులు దర్శించిన స్థలంగా ప్రసిద్ధి చెందింది. క్రీ.శ.1,326-35లో దీనికి మెట్లు నిర్మించారు. ఎంతో కష్టపడొచ్చి దూళి దర్శనం చేసుకున్న భక్తులు పాతాళ గంగలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించి దైవానుగ్రహం పొందాలని పండితులు సూచిస్తున్నారు.