News November 14, 2024
రఘురామకు విజయసాయిరెడ్డి విషెస్

AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎంపికైన TDP MLA రఘురామకృష్ణరాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్థానం గౌరవాన్ని కాపాడతారనే నమ్మకం ఉందన్నారు. గతం తాలూకూ జ్ఞాపకాలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన RRRకు VSR విషెస్ తెలపడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 4, 2025
కార్తీక మాసం: దీపాలెందుకు పెడతారు?

శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పాలద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారు.
News November 4, 2025
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్లో 405 పోస్టులు

హైదరాబాద్లోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్(<
News November 4, 2025
రబీలో వరికి బదులు ఆరుతడి పంటలతో లాభాలు

రబీ కాలంలో వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం 2 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పంట మార్పిడి వల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు తగ్గుతాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది.


