News September 3, 2024

విజయవాడ వరదలు: రూ.కోటి విరాళం

image

AP: విజయవాడలో వరద సహాయక చర్యల కోసం ఎన్నారై, పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ రూ.కోటి విరాళం ఇచ్చారు. నిన్న సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితుల సమస్యలు తననెంతో కలచివేస్తున్నాయని చెప్పారు. మరోవైపు విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లు విజయలక్ష్మి, నిర్మలాదేవి, రాణి రూ.50వేల చొప్పున రూ.1.50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. వరదలతో బెజవాడ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

Similar News

News September 18, 2025

మైథాలజీ క్విజ్ – 9 సమాధానాలు

image

1. రాముడికి ‘గంగానది’ ఒడ్డున గుహుడు స్వాగతం పలికాడు.
2. దుర్యోధనుడి భార్య ‘భానుమతి’.
3. ప్రహ్లాదుడు ‘హిరణ్యకశిపుడు’ అనే రాక్షస రాజు కుమారుడు.
4. శివుడి వాహనం పేరు నంది.
5. మొత్తం జ్యోతిర్లింగాలు 12. అవి మల్లికార్జునం, సోమనాథేశ్వరం, మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, కేదారనాథేశ్వరం, భీమశంకరం, నాగేశ్వరం, ఘృష్ణేశ్వరం, వైద్యనాథేశ్వరం, కాశీ విశ్వేశ్వరం, త్రయంబకేశ్వరం, రామేశ్వరం.<<-se>>#mythologyquiz<<>>

News September 18, 2025

ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

image

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.

News September 18, 2025

జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

image

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.