News July 6, 2024

త్వరలో విజయవాడ-కర్నూలు విమాన సర్వీసులు: మంత్రి భరత్

image

AP: కర్నూలు నుంచి విజయవాడకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌ను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. అలాగే రాత్రి పూట ఫ్లైట్ ల్యాండింగ్‌కు అవకాశం కల్పించాలని కోరగా, ఏడాది లోపే ఏర్పాట్లు చేస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News December 5, 2025

లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్స్

image

* నటి, బిగ్‌బాస్ తెలుగు-3 కంటెస్టెంట్ పునర్నవి త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. తన ప్రియుడు హేమంత్ వర్మ(ఫొటోగ్రాఫర్) కశ్మీర్‌లో చేసిన ప్రపోజల్‌కు ఓకే చెప్పినట్లు ఆమె ఇన్‌స్టాలో ఫొటోలు పంచుకున్నారు.
* సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రానికి ‘షో మ్యాన్’ టైటిల్‌ ఫిక్స్ చేయగా దీనికి సంబంధించిన ఫొటోలను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుమన్ విలన్‌గా నటించనున్నారు.

News December 5, 2025

నాలుగు వేదాల ప్రతీక ‘తిరుమాడ వీధులు’

image

తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ 4 దిక్కులా ఉన్న వీధులను తిరుమాడ వీధులు అంటారు. వీటిని 4 వేదాలకు ప్రతీకగా భావిస్తారు. భగవద్రామానుజులవారు స్వామివారి ఊరేగింపుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి వాహన సేవలు ఈ పవిత్ర వీధులలోనే వైభవంగా జరుగుతాయి. వీటి పవిత్రత కారణంగా, ఈ మాడ వీధుల్లో పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ వీధులు స్వామివారి వైభవాన్ని లోకానికి చాటిచెబుతాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 5, 2025

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

image

పండ్లు, కూరగాయలను వండే ముందు, తినే ముందు తప్పనిసరిగా నీటితో కడగాలి. కాస్త ఉప్పు లేదా వెనిగర్ లేదా పసుపు కలిపిన నీటిలో కాసేపు ఉంచి కడిగితే పండ్లు, కూరగాయలపై చేరిన పురుగు మందుల అవశేషాలను తొలగించవచ్చు. కొన్ని పురుగు మందులు వాటి గాఢతను బట్టి కూరగాయల ఉపరితలం నుంచి తొక్క లోపలి పొరల వరకు చొచ్చుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు తొక్క తొలగించి తీసుకోవడం మరింత మంచిది.