News March 27, 2025
విక్రమ్ ‘వీర ధీర శూర’కు లైన్ క్లియర్

అనివార్య కారణాలతో ఇవాళ మార్నింగ్ షోలు రద్దయిన ‘వీర ధీర శూర’ చిత్రానికి ఊరట లభించింది. ఈవినింగ్ షో నుంచి సినిమా ప్రదర్శన ఉంటుందని తెలుగు డిస్ట్రిబ్యూటర్ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. ఇప్పటికే రద్దైన షోలకు డబ్బులు తిరిగిస్తామని సినీ ప్రేక్షకులకు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, దుషారా విజయన్ , ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు.
Similar News
News March 30, 2025
కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.
News March 30, 2025
ముంబై, చెన్నైల పని అయిపోయిందా?

IPLలో ఒక్క ట్రోఫీ గెలిస్తేనే గొప్ప. అలాంటిది ముంబై, చెన్నై ఐదేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఇదంతా గతం. రోహిత్, ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి దూరమయ్యాక ఈ రెండు ఫ్రాంచైజీల పరిస్థితి దారుణంగా తయారైంది. 200కు పైగా స్కోర్లను అలవోకగా ఛేదించే ఈ జట్లలో ఇప్పుడు గెలవాలన్న కసి కనిపించట్లేదు. మొన్న RCBపై చెన్నై, నిన్న GTపై ముంబై బ్యాటింగ్ చూసి.. ఆ జట్ల పని అయిపోయినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు. COMMENT?
News March 30, 2025
నితీశ్ రాణా విధ్వంసం..

IPL-2025: చెన్నైతో జరుగుతోన్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ జైస్వాల్ (4) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా బౌండరీలతో వీరవిహారం చేస్తున్నారు. 22 బంతుల్లోనే 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 58* రన్స్ చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ స్కోర్ 6 ఓవర్లలో 79/1గా ఉంది.